News June 11, 2024

రాజన్న దర్శనానికి వచ్చి గుండెపోటుతో జనగామ వాసి మృతి

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చి గుండెపోటుతో భక్తుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన వినయ్ కుమార్.. రాజన్న దర్శనం చేసుకున్నాడు. అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లే మార్గ మధ్యలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికుల సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ మృతి చెందాడు.

Similar News

News March 26, 2025

KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

News March 26, 2025

నిర్ణీత గడువు లోపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అధికారులను ఆదేశించారు. మంగళవారం పాత ఆజంజాహీ మిల్ గ్రౌండ్లో 16.7 ఎకరాలలో రూ.80 కోట్లతో నిర్మిస్తున్న జీ ప్లస్ టూ కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు బ్లూ ప్రింట్ మ్యాప్ ప్రకారం పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News March 26, 2025

వరంగల్: అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

image

మామూనూర్ ఎయిర్‌పోర్టు, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పనుల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సత్య శారదా దేవి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కార్యాచరణ ప్రణాళిక పురోగతిపై అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనుల్లో భూమి కోల్పోయిన రైతులకు, భూముల అవార్డింగ్ పాస్ అయిన వారికి డబ్బులు చెల్లించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

error: Content is protected !!