News March 31, 2025

రాజన్న సిరిసిల్ల: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

image

SRCL జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్‌ను ఫైనల్ చేయలేదు. జిల్లాకు 7,000 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికారపార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని జోరుగా పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.

Similar News

News September 16, 2025

మెగా డీఎస్సీ.. ఏలూరు జిల్లాలో 1,063 మంది క్వాలిఫై

image

మెగా డీఎస్సీలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1,063 మంది అభ్యర్థులు అర్హత సాధించారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ సోమవారం వెల్లడించారు. ఏప్రిల్ 24న 13,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆగస్టు 1న తుది ‘కీ’ విడుదలైంది. సెప్టెంబర్ 15న విడుదలైన క్వాలిఫై జాబితాలో ఏలూరు జిల్లా నుంచి 1,063 మంది ఎంపికైనట్లు ఆమె తెలిపారు. ఏ విభాగంలో ఎంతమంది అర్హత సాధించారన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News September 16, 2025

భూమికి సమీపంగా భారీ ఆస్టరాయిడ్

image

ఓ భారీ గ్రహశకలం త్వరలో భూమికి సమీపంగా రానున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2025 FA22 అనే ఆస్టరాయిడ్‌ సెప్టెంబర్ 18 ఉ.8.33 గం.కు భూమికి అత్యంత సమీపంలోకి రానుందని చెబుతున్నారు. అప్పుడు ఇది భూమికి 8,41,988 కి.మీ. దూరంలోనే ప్రయాణించనుంది. అయితే ఆ శకలం గురుత్వాకర్షణ పరిధిలోకి రాదని అంటున్నారు. దీని చుట్టుకొలత 163.88 మీ., పొడవు 280 మీ.గా ఉంది. నాసా దీని కదలికలను పరిశీలిస్తోంది.

News September 16, 2025

మాజీ రంజీ క్రికెటర్ ఎస్. సత్యదేవ్ కన్నుమూత

image

కాకినాడకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ ఎస్. సత్యదేవ్ (84) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. 1964-65 సీజన్‌లో విశాఖపట్నం – హైదరాబాద్‌తో ఆయన అరంగేట్రం చేశారు. ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందారు. 16 రంజీ మ్యాచ్‌ల్లో ఒక సెంచరీతో సహా 503 పరుగులు చేశారు. ఆయన మృతికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సతీశ్ బాబు, తూ.గో క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.