News February 27, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు పట్టభద్రులు 22,397 మంది (5.2 శాతం), ఉపాధ్యాయులు 950 మంది (11.52 )శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News March 24, 2025

కెరమెరి: కుక్కకాటు.. బాలుడి మృతి

image

కుక్కకాటుతో 4ఏళ్ల బాలుడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కెరమెరికి చెందిన చౌహాన్ రుద్ర దాస్,సరోజ దంపతుల కుమారుడు రిషిని కొద్ది రోజుల కిందట కుక్క కరిచింది. అప్పుడు తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఇంటికొచ్చిన కొద్దిరోజులకు బాలుడిలో మళ్లీ రేబిస్ లక్షణాలు కనిపించాయి. దీంతో కాగజ్‌నగర్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.

News March 24, 2025

పోలీస్ కుటుంబాలు నన్ను తిట్టుకుంటున్నాయి: MLA

image

చిత్తూరు జిల్లాలో పోలీసు కుటుంబాలు తనను తిట్టుకుంటున్నాయని పలమనేరు MLA అమర్‌నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య అనంతరం వైసీపీకి అనుకూలంగా పని చేసిన వారిని మార్చమని అడిగితే.. SP ఇష్టానికి బదిలీలు చేశారని ఆరోపించారు. దీంతో వారి భార్యా పిల్లలు తనను ద్వేషిస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు శాశ్వతం కాదని, అధికారులే శాశ్వతం అని ఆయన పేర్కొన్నారు.

News March 24, 2025

రంగారెడ్డి జిల్లా ఉష్ణోగ్రతలు ఇలా..

image

రంగారెడ్డి జిల్లాలో ఆదివారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా కాసులాబాద్లో 37.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళ్‌పల్లిలో 36.6℃, హస్తినాపురం, ఎలిమినేడు 36.3, చుక్కాపూర్ 36.2, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, దండుమైలారం 35.7, చందానవెల్లి 35.4, మొగల్గిద్ద, వైట్‌గోల్డ్ SS 35.3, తొమ్మిదిరేకుల 35.1, అలకాపురి, గచ్చిబౌలి, మియాపూర్ 35.1, షాబాద్, కేతిరెడ్డిపల్లిలో 35℃ ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!