News March 3, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా మార్నింగ్ ఉష్ణోగ్రతలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మార్నింగ్ ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. కొనరావుపేట 39.0°c, వీర్నపల్లి 39 0°c, సిరిసిల్ల 38.6°c, రుద్రంగి 38.5 °c, గంభీరావుపేట 37.9°c, ఇల్లంతకుంట 37.7°c, చందుర్తి 37.3°c, బోయిన్పల్లి 37.2 •c, ముస్తాబాద్ 36.6 °c, ఎల్లారెడ్డిపేట 36.2°c, వేములవాడ 36.1°cగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Similar News
News October 28, 2025
KNR: ‘హరీశ్ రావు కుటుంబానికి మనోధైర్యం కల్పించాలి’

మాజీమంత్రి హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు మరణం బాధాకరమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. హరీశ్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని అమ్మవారిని వేడుకుంటున్నానని, తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని పేర్కొన్నారు. వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని HYDలోని క్రిన్స్ విల్లాస్లో ఉంచారు.
News October 28, 2025
GNT: ఇలా ఉన్నారేంట్రా బాబు.!

తుఫాను వేళ అధికారులు ఏర్పాటు చేస్తున్న టోల్ ఫ్రీ నంబర్లను కొందరు ఆకతాయిలు మిస్ యూజ్ చేస్తున్నారు. నిన్న మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఆఫీసుకు ఓ వ్యక్తి కాల్ చేశాడు. నాకు ఇల్లు లేదు ఇల్లు ఇస్తారా? అని ఫోన్లో అడిగాడట. అలా ఇవ్వలేం సార్ అని సిబ్బంది చెప్పగా.. ‘మరి ఏ సాయం కావాలన్నా చేస్తామని ఎందుకు చెప్తున్నారు’ అని కోపంగా ఫోన్ పెట్టేశాడట. దీంతో విస్తుపోవడం సిబ్బంది వంతైంది.
News October 28, 2025
పెయ్య దూడకు జున్నుపాలను నిర్లక్ష్యం చేయొద్దు

పశువు ఈనిన ఒక గంట లోపల దూడకు జున్ను పాలు తాగించాలి. ఈ సమయంలోనే జున్ను పాలలో రోగనిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్ను దూడ వినియోగించుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆలస్యమైతే ఈ యాంటీబాడీస్ను జీర్ణించుకొనే శక్తి పెయ్యలో తగ్గుతుంది. జున్ను పాలలో తేలికగా జీర్ణమయ్యే మాంసకృత్తులు, విటమిన్-ఎ ఎక్కువగా ఉంటాయి. జున్ను పాలు తాగిన దూడలు 6 నెలల వయసు వరకు రోగనిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉండి త్వరగా పెరుగుతాయి.


