News March 3, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా మార్నింగ్ ఉష్ణోగ్రతలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మార్నింగ్ ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. కొనరావుపేట 39.0°c, వీర్నపల్లి 39 0°c, సిరిసిల్ల 38.6°c, రుద్రంగి 38.5 °c, గంభీరావుపేట 37.9°c, ఇల్లంతకుంట 37.7°c, చందుర్తి 37.3°c, బోయిన్పల్లి 37.2 •c, ముస్తాబాద్ 36.6 °c, ఎల్లారెడ్డిపేట 36.2°c, వేములవాడ 36.1°cగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News January 9, 2026

NGKL: సింగోటం జాతర ఏర్పాట్లపై మంత్రి జూపల్లి సమీక్ష

image

కొల్లాపూర్‌లోని సింగోటం జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కలెక్టర్ సంతోష్‌తో కలిసి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రికి పండితులు ఆశీర్వచనాలందించారు. జాతరలో ప్రత్యేక ఆకర్షణగా టూరిజంశాఖతో ఐమాక్స్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News January 9, 2026

పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను సత్వరమే పంపిణీ చేయాలని కలెక్టర్‌ కృతికా శుక్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకతతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

News January 9, 2026

తెనాలి: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష

image

తెనాలి (M) నందివెలుగు వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడిన ఫిరంగిపురానికి చెందిన ఉయ్యాల తిరుపతయ్యకు 3 నెలలు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పవన్ కుమార్ తీర్పు ఇచ్చారు. 2022లో అప్పటి రూరల్ SI CH వెంకటేశ్వర్లు నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు 60 బస్తాల PDS బియ్యంతో పట్టుబడగా, శుక్రవారం కేసు విచారణకు వచ్చింది. APP సునీల్ కుమార్ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు.