News March 3, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా మార్నింగ్ ఉష్ణోగ్రతలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మార్నింగ్ ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. కొనరావుపేట 39.0°c, వీర్నపల్లి 39 0°c, సిరిసిల్ల 38.6°c, రుద్రంగి 38.5 °c, గంభీరావుపేట 37.9°c, ఇల్లంతకుంట 37.7°c, చందుర్తి 37.3°c, బోయిన్పల్లి 37.2 •c, ముస్తాబాద్ 36.6 °c, ఎల్లారెడ్డిపేట 36.2°c, వేములవాడ 36.1°cగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Similar News
News February 28, 2026
వేట్లపాలెం ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డ బాధితులకు రూ. 50 వేల చొప్పున పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషాద సమయంలో కేంద్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
News February 28, 2026
VKB జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన దీపక్ తివారి

వికారాబాద్ జిల్లా కలెక్టర్గా దీపక్ తివారి బాధ్యతలు స్వీకరించారు. శనివారం జిల్లా అధికారులు నూతన కలెక్టర్కు స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ పరిపాలన యంత్రాంగాన్ని సరైన విధంగా నడిపిస్తామని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామంటూ అధికారులంతా కలిసికట్టుగా పని చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.
News February 28, 2026
పెద్దపల్లి: దానాపూర్కు హోలీ స్పెషల్ ట్రైన్

చర్లపల్లి-దానాపూర్ మధ్య హోలీ స్పెషల్ ట్రైన్ నడుపనున్నట్లు SCR అధికారులు పేర్కొన్నారు. రైలు నం.07097 నేడు 20:30 గంటలకి చర్లపల్లిలో బయలుదేరి కాజీపేట, రామగుండం, బల్హర్షా, నాగపూర్, ప్రయాగ్రాజ్ మీదుగా మార్చి 2న ఉదయం 9:30గంటలకు దానాపూర్ చేరుతుందన్నారు. అదే రోజు ఉదయం 11:30గంటలకు దానాపూర్ నుండి రైలు నం.07098 బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:45కి చర్లపల్లి చేరుతుందన్నారు. రామగుండంలో ఈ ట్రైన్ ఆగుతుంది.


