News January 27, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా వెదర్ అప్‌డేట్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 10 మండలాల్లో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంభీరావుపేట 12.9, తంగళ్ళపల్లి 13.8, రుద్రంగి 13.8, కోనరావుపేట 14.2, వీర్నపల్లి 14.2, బోయినపల్లి 14.6, వేములవాడ రూరల్ 14.6, ముస్తాబాద్ 14.9, చందుర్తి 15.0, గంభీరావుపేట 15.0 లుగా చలి ఉన్నట్లు తెలిపారు. ఈ చలికి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు.

Similar News

News April 10, 2026

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: అడ్లూరి

image

రైతు పండించిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురి పట్టణ కేంద్రంల్లోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రైతులు రబీ సీజన్లో పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిదన్నారు.

News April 10, 2026

నల్గొండ: ఆ 1,483 స్కూల్స్ బాగుపడితే తిరుగుండదు

image

నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ ZPHS.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మంత్రి కోమటిరెడ్డి సొంతంగ రూ.8 కోట్లతో ఈ బడిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడంతో, వచ్చే ఏడాది ప్రవేశాలకు అప్పుడే వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అడ్మిషన్లు క్లోజ్ చేశారు. అయితే, జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1,483 ప్రభుత్వ పాఠశాలలను కూడా డెవలప్ చేస్తే పేరెంట్స్ ప్రైవేట్ వైపు వెళ్లరు కదా అనే చర్చ మొదలైంది.

News April 10, 2026

రామాయంపేట: సైకిల్ పై నుంచి కిందపడి రైతు మృతి

image

సైకిల్ పై నుంచి కిందపడి రైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన బొడ్డు మల్లయ్య అనే రైతు తన పొలానికి వెళ్లి వస్తుండగా సైకిల్‌కు కుక్క అడ్డు రావడంతో కిందపడి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.