News March 23, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

image

రాజన్న SRCL జిల్లాలో నిన్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. చందుర్తి(M) ఎనగల్ గ్రామంలో పసుల లచ్చయ్య(60) అనే ఉపాధిహామీ <<15847894>>కూలీ<<>> పనిచేసాక భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయాడు. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మామిండ్ల మహేశ్(24) ఈ నెల17న ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్సపొందుతూ నిన్న మృతిచెందాడు. బోయినపల్లి మండలం మానవాడలో దాసరి నర్సయ్య(58) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో చనిపోయాడు.

Similar News

News December 9, 2025

ముగిసిన ‘అఖండ-2’ వివాదం!

image

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న రాత్రి ఈరోస్ సంస్థతో 14 రీల్స్‌కు సానుకూల చర్చలు జరిగాయని తెలిపాయి. ఇవాళ కోర్టు విచారణలో ఇదే విషయాన్ని తెలియజేసి విడుదలకు అనుమతులు తీసుకుంటుందని వెల్లడించాయి. ఈ క్రమంలో 12న విడుదల, 11న ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇవాళ ఉ.10.30కు మద్రాస్ కోర్టులో విచారణ జరగనుంది.

News December 9, 2025

రేపు ఉద్యోగులతో పవన్ మాటామంతీ

image

AP: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ రేపు ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. మంగళగిరిలోని ఓ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలను ఆయన వారికి వివరిస్తారు. అలాగే ఎలాంటి విధానాలు పాటిస్తే గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమో తెలుసుకోనున్నారు. అవినీతిరహిత పాలనను అందించేందుకు సహకరించాలని కోరనున్నారు.

News December 9, 2025

కరీంనగర్: ఉప సర్పంచ్ కుర్చీకి రూ.5- 10 లక్షలు..?

image

పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవికి డిమాండ్ భారీగా పెరిగింది. దీనికి కారణం జాయింట్ చెక్ పవర్ ఉండటమే. ఈ కుర్చీని దక్కించుకోవడానికి ఆశావహులు వార్డు మెంబర్ స్థానంలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో ఈ పదవి కోసం ఏకంగా రూ.5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. వార్డు సభ్యులను తమవైపు తిప్పుకోవడానికి నగదు ఆఫర్లు, రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికంగా ఎన్నికల వేడిని రాజేస్తోంది.