News April 11, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉష్ణొగ్రత వివరాలు..

గడిచిన 24 గంటల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాలుగు మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇల్లంతకుంట 41.2°c, వీర్నపల్లి 41.1°c, రుద్రంగి 40.3°c, బోయిన్పల్లి 40.3°c, వేములవాడ రూరల్ 39.9°c, చందుర్తి 39.9°c, గంభీరావుపేట 39.4°c, తంగళ్ళపల్లి 39. 4°c, ముస్తాబాద్ 39.3°c, సిరిసిల్ల 38.7°c, ఎల్లారెడ్డిపేట 38.0°cలుగా నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Similar News
News March 15, 2026
పులిని పట్టుకునేందుకు ‘హనుమాన్’ బృందాలు: డిప్యూటీ సీఎం ఆదేశం

జిల్లాలో కలకలం రేపుతున్న పెద్దపులిని పట్టుకునేందుకు 10 హనుమాన్ బృందాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆదివారం అధికారులతో మాట్లాడిన ఆయన, కూర్మాపురం తరహాలోనే పులిని బంధించి విశాఖ జూకు తరలించాలని సూచించారు. ఈ ఆపరేషన్ పర్యవేక్షణ బాధ్యతను సీసీఎఫ్ చలపతిరావుకు అప్పగించారు. పులి భయం లేకుండా ప్రజలకు భద్రత కల్పించాలని అటవీ శాఖను ఆదేశించారు.
News March 15, 2026
ప.గో జిల్లాలో అక్షరాంధ్ర పరీక్షకు 99.9 శాతం హాజరు

జిల్లాలో అక్షరాంధ్ర లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మొత్తం 60,865 మంది అభ్యర్థులకు గాను 60,829 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాను నూరు శాతం అక్షరాస్యత దిశగా తీర్చిదిద్దేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
News March 15, 2026
అకౌంట్లలోకి రూ.6,000.. మొదట వీరికే!

TG: అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఈ నెల 22న ‘రైతుభరోసా’ నిధులు <<19391741>>విడుదల<<>> చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా ఎకరం వరకు ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.6,000 చొప్పున జమ చేయనుంది. ఇందుకోసం సర్కార్ రూ.3,590 కోట్లు వెచ్చించనుంది. ఇక 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత డబ్బులు రిలీజ్ చేయనుంది. కాగా రైతుభరోసా ద్వారా ఏడాదికి రూ.12వేలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.


