News January 28, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రైమ్ న్యూస్

ఎల్లారెడ్డిపేట మండలంలోని ఐదు తండాల్లో ఎక్సైజ్ పోలీసుల దాడులు..300 లీటర్స్ బెల్లం పానకం, 10 లీటర్స్ నాటుసారా ధ్వంసం @కిసాన్ దాస్ పేటలో చోరీ విఫలయత్నం @రుద్రంగి మండల కేంద్రంలో మళ్ళీ దొంగల బీభత్సం..రూ. 10వేలు చోరీ @ఎల్లారెడ్డిపేటలో వీడని మూఢనమ్మకాలు @ఎల్లారెడ్డిపేలో దొంగల బీభత్సం..రూ.30వేల అపహరణ @తంగళ్ళపల్లిలో దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం.
Similar News
News October 15, 2025
శ్రీశైలం రహదారిపై రేపు ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా అక్టోబర్ 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం వెళ్లే రహదారిపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు, వాహనదారులు సహకరించాలని కోరారు.
News October 15, 2025
గ్రేటర్ విజయవాడ సాధ్యమయ్యేనా..?

విజయవాడ కార్పొరేషన్ను గ్రేటర్ విజయవాడగా మార్చాలని 2017లోనే ప్రతిపాదించారు. విజయవాడకు ఆనుకుని ఉన్న పెనమలూరు, గన్నవరం నియోజకవర్గంలోని 45-50 గ్రామాలను గ్రేటర్లో కలపాలని ప్రణాళిక వేశారు. నగర విస్తరణ 62KM నుంచి 165KM చేరుకుంటుంది. అయితే అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతం గ్రేటర్ విజయవాడ కంటే అమరావతికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీంతో ఇప్పట్లో గ్రేటర్ విజయవాడ కల నెరవేరేలా కనిపించడం లేదు.
News October 15, 2025
గుండెపోటుతో గోవా మాజీ సీఎం కన్నుమూత

గోవా మాజీ సీఎం, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి రవి నాయక్(79) కన్నుమూశారు. ఇంట్లో నిన్న రాత్రి ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి ఒంటిగంట సమయంలో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇవాళ 3PMకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నాయక్ మృతి పట్ల పీఎం మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాసేవకు జీవితం అంకితం చేశారని కొనియాడారు.