News January 28, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యాంశాలు

మల్కాపూర్ గుట్టలో పెద్దపులి.. భయాందోళనలో గ్రామస్థులు
@రూ.15కోట్ల 65లక్షల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
@పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: అదనపు ఎస్పీ
@రేపు మామిడిపల్లి సీతారాముల ఆలయంలో మాఘ అమావాస్య జాతర
@ప్రభుత్వ విప్ ఆది చొరవతో స్వదేశానికి అంజి
@బీఆర్ఎస్లో చేరిన మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంజనీ కుమార్
@కరాటే శిక్షకులకు దరఖాస్తుల ఆహ్వానం
@భవిష్యత్ మళ్లీ కచ్చితంగా గులాబీ జెండాదే: కేటీఆర్
Similar News
News November 15, 2025
బిహార్ రిజల్ట్స్: ఎన్డీఏ డబుల్.. కాంగ్రెస్ ఢమాల్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమిని తెచ్చిపెట్టాయి. ఎన్డీఏ డబుల్ సెంచరీ కొట్టగా కాంగ్రెస్ మాత్రం 6 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికల్లో INCకి 19 సీట్లు రాగా ఈ సారి అందులో మూడో వంతే రావడం గమనార్హం. డబుల్ ఇంజిన్ సర్కారుకే మొగ్గు చూపిన ఓటర్లు రాహుల్ ప్రచారాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ఇక బీజేపీకి 89 సీట్లు రాగా జనతా దళ్కు ఏకంగా 85 వచ్చాయి.
News November 15, 2025
పుట్టపర్తి కలెక్టరేట్లో గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు

పుట్టపర్తిలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను ఈ నెల 17న తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులు సమర్పించడానికి ప్రజలు కలెక్టరేట్కు రావద్దని కలెక్టర్ కోరారు.
News November 15, 2025
అరటి రైతు ఆర్తనాదం

అనంతపురం జిల్లాలో అరటి రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టాలను ఎదుర్కొంటున్నారు. పంటకు కనీస మద్దతు ధర లేక, కొనేవారు కరువై దయనీయ స్థితి నెలకొంది. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకే ఢిల్లీ మార్కెట్కు అరటి చేరుతుండటంతో స్థానిక వ్యాపారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో 15వేల హెక్టార్లలో పంట సాగులో ఉండగా, టన్ను ధర రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకే ఉండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


