News January 29, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలి తీవ్రత ఉన్న మండలాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏడు మండలాలకు చలి తీవ్రత ఉన్నట్లు బుధవారం వాతావరణ శాఖ తెలిపింది. గంభీరావుపేట 13.5, బోయిన్పల్లి 14. 2, తంగళ్ళపల్లి 14.5, రుద్రంగి 14.7, వేములవాడ రూరల్ 14.8, వీర్నపల్లి 14.9, కోనరావుపేట 14.9గా టెంపరేచర్ నమోదయ్యింది. ఈ 7 మండలాలకు చలి తీవ్రత ఉన్నందున వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు.
Similar News
News November 25, 2025
ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఆంధ్ర యూనివర్సిటీలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్లో 6 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ASST ప్రొఫెసర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డెమోగ్రఫి, పాపులేషన్ స్టడీస్, స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, సైకాలజీ, ఆంత్రోపాలజీలో మాస్టర్ డిగ్రీ, M.Phil, PhDతో పాటు SET/SLET/NET అర్హత సాధించి ఉండాలి. వెబ్సైట్: andhrauniversity.edu.in/
News November 25, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారికి అర్చకులు మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మార్గశిర మాసం, మొదటి మంగళవారం, పంచమి తిథి సందర్బంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
News November 25, 2025
‘వేములవాడ రాజన్నా.. నీ సొమ్ము భద్రమేనా..?’

వేములవాడ రాజన్న స్వామి దేవస్థానం సొమ్ము భద్రమేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సత్తమ్మ అనే పత్తి రైతు ఆధార్ నంబర్కు రాజన్న ఆలయ ట్రస్టు బ్యాంకు ఖాతా లింకై ఉన్నట్లు వెలుగులోకి రావడంతో ఆలయ సొమ్ము భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు వ్యక్తి ఆధార్ కార్డు ప్రభుత్వ అధీనంలో ఉండే ఆలయ ట్రస్టు ఖాతాకు అనుసంధానం కావడానికి కారణం ఏంటన్నది తేలాల్సి ఉంది. దీనిపై విచారణ చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.


