News January 29, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలి తీవ్రత ఉన్న మండలాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏడు మండలాలకు చలి తీవ్రత ఉన్నట్లు బుధవారం వాతావరణ శాఖ తెలిపింది. గంభీరావుపేట 13.5, బోయిన్పల్లి 14. 2, తంగళ్ళపల్లి 14.5, రుద్రంగి 14.7, వేములవాడ రూరల్ 14.8, వీర్నపల్లి 14.9, కోనరావుపేట 14.9గా టెంపరేచర్ నమోదయ్యింది. ఈ 7 మండలాలకు చలి తీవ్రత ఉన్నందున వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు.

Similar News

News February 9, 2025

ప్రత్తిపాడు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

ప్రత్తిపాడులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం(M) కొండ్రుపోలుకు చెందిన లక్ష్మి మృతిచెందింది. భర్త సత్యనారాయణతో దువ్వలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రత్తిపాడు హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయమై చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI స్వామి తెలిపారు.

News February 9, 2025

భువనగిరి: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

image

భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను నేటి నుంచి 20వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు ప్రయాణించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట – ఖమ్మం – విజయవాడ మధ్య మూడో ట్రాక్ లైన్ పనుల కారణంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు, ప్రజలు గమనించగలరని కోరారు.

News February 9, 2025

రోడ్డుప్రమాదంలో తాడేపల్లిగూడెం మహిళ మృతి

image

ప్రత్తిపాడులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం(M) కొండ్రుపోలుకు చెందిన లక్ష్మి మృతిచెందింది. భర్త సత్యనారాయణతో దువ్వలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రత్తిపాడు హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయమై చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI స్వామి తెలిపారు.

error: Content is protected !!