News April 11, 2025

రాజన్న సిరిసిల్ల: వేసవి వచ్చేసింది.. జాగ్రత్త!

image

వేసవి వచ్చేసింది. దీంతో ఉక్కబోత పెరిగింది. అయితే సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో ఉక్కబోత కారణంగా బయట పడుకుంటుంటారు. అదే అదనుగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగారు ఆభరణాలు, ఫోన్లు దొంగిలించే అవకాశముందని చెబుతున్నారు. సెలవుల్లో ఊర్లకు వెళ్తే ఇంటికి తాళాలు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, చిన్నారులను ఈతకు వెళ్లకుండా చూడాలని సూచిస్తున్నారు.

Similar News

News October 23, 2025

MBNR: విద్యార్థులు ALERT.. నేడే లాస్ట్

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ నేటితో ముగియనున్నదని న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె.మాలావి Way2Newsతో తెలిపారు. ఎల్ఎల్ఎం కోర్సులో మొత్తం 20 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే పలువురు విద్యార్థులు రిపోర్ట్ చేశారని, రిపోర్ట్ చేయని విద్యార్థులు సంబంధిత పత్రాలతో నేడు రిపోర్ట్ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదే న్యాయ కళాశాల మంజూరు చేసిన విషయం తెలిసిందే.

News October 23, 2025

విజయవాడ: శైవక్షేత్రాలను దర్శించే వారికి శుభవార్త చెప్పిన ఆర్టీసీ

image

కార్తీకమాసం సందర్భంగా విజయవాడ నుంచి యాగంటి, మహానంది, శ్రీశైలంకు(త్రిలింగదర్శిని) ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతామని జిల్లా ప్రజారవాణా అధికారి వై.దానం తెలిపారు. కార్తీకమాసంలో ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు ఈ బస్సులు విజయవాడ నుంచి బయలుదేరతాయన్నారు. ఈ బస్సు రూ.1,800(సూపర్ లగ్జరీకు) ఛార్జి నిర్ణయించామని, http://apsrtconline.in/ వెబ్‌సైట్‌లో సైతం టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు.

News October 23, 2025

259 ట్రాన్స్‌ఫార్మర్లతో మేడారానికి విద్యుత్ వెలుగులు..!

image

ఈసారి జరిగే మేడారం మహా జాతరలో విద్యుత్ శాఖ భారీ ఏర్పాట్లకు సన్నద్ధమవుతోంది. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 259 ట్రాన్స్‌ఫార్మర్లు, 9111 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. వనదేవతల గద్దెల ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగేలా లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. 250km పొడవునా లైటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం టీజీ ఎన్పీడీసీఎల్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టనుంది.