News February 16, 2025
రాజబాబు లేనిలోటు తీరనిది: జగన్

ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లికి చెందిన YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు కన్నుమూశారు. ఆయన మృతిపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ‘సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరం. రాజబాబు మరణం మా పార్టీకి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.
Similar News
News September 19, 2025
MDK: కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు

ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.84 వేల కోట్లు అయితే కేవలం తమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టే ప్రాణహిత-చేవెళ్లకు రూ.35 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. రూ.35వేల కోట్లు ఖర్చు చేసి కేవలం 4.47లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం, అమోఘమని ఎద్దేవా చేశారు.
News September 19, 2025
ఏపీలో గోల్డ్ మైన్.. త్వరలో పసిడి ఉత్పత్తి!

AP: కర్నూల్(D) జొన్నగిరి వద్ద తాము అభివృద్ధి చేస్తున్న గనిలో త్వరలో పసిడి ఉత్పత్తిని ప్రారంభిస్తామని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ MD హనుమప్రసాద్ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వగానే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇదే జరిగితే దేశంలో గనుల నుంచి బంగారాన్ని తీసే తొలి ప్రైవేట్ కంపెనీగా DGML నిలవనుంది. ఏటా 750-1000kgs గోల్డ్ ఉత్పత్తి అవుతుందని అంచనా.
News September 19, 2025
దేశంలోనే ముల్కనూర్ సహకార సొసైటీ నంబర్ 1

HNK జిల్లా భీమదేవరపల్లి(M) ముల్కనూర్ సహకార సొసైటీ దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. ఇది ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద సోసైటీగా గుర్తింపు పొందింది. 1956లో అలిగిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి 373 మంది రైతులతో రూ.2,300 మూలధనంతో ప్రారంభించారు. ఈ సొసైటీ ప్రస్తుతం 7,540 మంది రైతులతో రూ.400 కోట్లతో విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం ముల్కనూర్ సహకార పరపతి సంఘం 69వ వార్షిక మహాసభ వేడుకలు జరుగుతున్నాయి.