News February 16, 2025
రాజబాబు లేనిలోటు తీరనిది: జగన్

ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లికి చెందిన YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు కన్నుమూశారు. ఆయన మృతిపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ‘సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరం. రాజబాబు మరణం మా పార్టీకి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.
Similar News
News March 8, 2026
నెల్లూరు: వారిని జైలు కలిపింది.!

ఆ ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు. వీరిలో రామకృష్ణపై 27 కేసులు, మరో నిందితుడు బిట్రగుంటకు చెందిన మాల్యాద్రిపై14 కేసులు ఉన్నాయి. జైలులో వీరికి పరిచయం ఏర్పడడంతో మరిన్ని చోరీలకు కలిసికట్టుగా చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా చిన్న బజార్ PS పరిధిలో <<19323990>>చేతివాటం<<>> చూపగా ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.63 వేల నగదు, 153 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
News March 8, 2026
ములుగులో అంతర్జాతీయ సదస్సు

ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 10, 11 తేదీల్లో “కథా సాహిత్యం-సామాజిక చైతన్యం” అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు బ్రోచర్ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. కథా సాహిత్యం, సామాజిక చైతన్యానికి మధ్య గల సంబంధాన్ని అంతర్జాతీయ కోణంలో ఈ సదస్సులో చర్చించనున్నట్లు సంచాలకులు బి.బాలయ్య తెలిపారు.
News March 8, 2026
గద్వాల కీర్తి పతాక.. మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ

గద్వాల సంస్థానపు చివరి పాలకురాలు మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ మహిళా లోకానికి స్ఫూర్తిప్రదాత. 1946-49 మధ్య పాలన సాగించిన ఆమె, నిజాం నవాబును ఎదిరించి న్యాయపోరాటం ద్వారా సంస్థానాన్ని నిలబెట్టుకున్నారు. సాహిత్య పోషణలో గద్వాలకు ‘విద్వద్గద్వాల’గా కీర్తి తెచ్చారు. ఆమె స్మరణార్థం కోటలో ఏర్పాటు చేసిన MALD డిగ్రీ కళాశాల జిల్లాలోనే మొదటిది. 1953 ఆగస్టు 18న ఆమె కన్నుమూశారు. # నేడు అంతర్జాతీయ మహిళ దినోత్సవం.


