News August 15, 2024

రాజమండ్రికి చెందిన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

రాజమహేంద్రవరానికి చెందిన బీటెక్ విద్యార్థి నూజెండ్ల శశాంక్ (20) మంగళగిరి మండలంలోని ప్రైవేట్ యూనివర్సిటీలో బుధవారం ఉరి వేసుకుని మృతి చెందాడు. మంగళగిరి గ్రామీణ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలో శశాంక్ సీఎస్ఈ విభాగంలో రెండో ఏడాది చదువుతున్నాడు. మొదటి సంవత్సరం ఫలితాలలో బ్యాక్ లాగ్ ఉండటంతో వసతి గృహంలోని తన గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Similar News

News December 15, 2025

తూ.గో: కల్లు అమ్మకాలు నిలిపివేయించిన ఎమ్మెల్యే.. అసలేం జరిగిందంటే..!

image

ఆధ్యాత్మిక స్థలాల్లో ధార్మిక ఆచారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు. ఏవీఏ రోడ్డులోని జీవకారుణ్య సంఘ స్థలంలో ఆ సంస్థ మాజీ డైరెక్టర్ చొల్లంగి ఏడుకొండలు కల్లు విక్రయాలు సాగిస్తున్నట్లు తెలియడంతో అధికారులతో కలిసి అక్కడికి వెళ్లి వాటిని నిలిపివేయించారు. పవిత్రమైన ప్రాంతాల్లో ఇలాంటి పనులు చేయడం తగదని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది హెచ్చరించారు.

News December 15, 2025

రాజమండ్రి: రేపటి నుంచి ఉర్దూ స్వర్ణోత్సవ వారోత్సవాలు

image

ఉర్దూ అకాడమీ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 16 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణోత్సవ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి తెలిపారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో ఉర్దూ అకాడమీ ప్రతినిధి నస్రీన్ ఫాతిమాతో కలిసి కార్యక్రమ వివరాలు వెల్లడించారు. మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, అందరూ వీటిని విజయవంతం చేయాలని కోరారు.

News December 15, 2025

తూ.గో: పాత నేరస్థుల ఇళ్లపై పోలీసుల నిఘా

image

తూ.గో జిల్లాలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా టీములుగా ఏర్పడి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా 68 నంబర్, రికార్డు లేని ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ చేశామని తెలిపారు. 30 మంది పాత నేరస్థుల ఇళ్లను తనిఖీ చేశామన్నారు.