News February 24, 2025
రాజమండ్రిలో కోనసీమ వ్యక్తి మృతి

వెంకటనగరం వీఆర్వో గునపాటి మురళీకృష్ణ (49) ఆదివారం అనారోగ్యంతో రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతిచెందారు. ఆయన స్వగ్రామం ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామం. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. మురళీకృష్ణ మృతి పట్ల రూరల్ తహశీల్దార్ సూర్యకుమార్, విఆర్వోలు, తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Similar News
News November 25, 2025
NTR: జోగి రమేష్కి రిమాండ్ పొడిగింపు

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము, అద్దేపల్లి జనార్దనావుతో సహా ఏడుగురు నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు మంగళవారం రిమాండ్ పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరచగా, డిసెంబర్ 9 వరకు రిమాండ్ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
News November 25, 2025
లిప్స్కీ LED మాస్క్

ప్రస్తుతం LED మాస్క్ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇవి సౌందర్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో లిప్స్కీ LED మాస్క్ వచ్చింది. దీన్ని నోటిపై పెట్టుకొని సపోర్ట్ హ్యాండిల్ని పళ్లతో పట్టుకోవాలి. డివైజ్ స్విచ్ ఆన్/ ఆఫ్ బటన్స్ ఉంటాయి. వీటిని వాడటం వల్ల పెదాలపై ఉండే ముడతలు, గీతలు పోయి అందంగా మెరుస్తాయి. ఇది ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించి చూడండి.
News November 25, 2025
ఆకుకూరల సాగుకు నేల తయారీ, ఎరువులు

ఆకుకూరల సాగు కోసం నేలను 3-4 సార్లు దున్ని చదును చేయాలి. పంటను బట్టి నేల తయారీలో ఎకరాకు 6-10 టన్నుల చివికిన పశువుల ఎరువు, 20 నుంచి 30 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 10-20 కిలోల యూరియా, పొటాష్ ఎరువులు వేసి నేలను సిద్ధం చేయాలి. తర్వాత అధిక వర్షాలకు నీరు ఇంకిపోయే విధంగా ఎత్తు మడులను, వాన నీరు నిల్వ ఉండకుండా నేలను తయారు చేసుకోవాలి. ఎత్తు మడుల వల్ల భారీ వర్షాలు కురిసినా పంటకు తక్కువ నష్టం జరుగుతుంది.


