News February 24, 2025

రాజమండ్రిలో కోనసీమ వ్యక్తి మృతి

image

వెంకటనగరం వీఆర్‌వో గునపాటి మురళీకృష్ణ (49) ఆదివారం అనారోగ్యంతో రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతిచెందారు. ఆయన స్వగ్రామం ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామం. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. మురళీకృష్ణ మృతి పట్ల రూరల్‌ తహశీల్దార్‌ సూర్యకుమార్, విఆర్‌వోలు, తహశీల్దార్‌ కార్యాలయం సిబ్బంది ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Similar News

News December 6, 2025

విమాన సర్వీసుల ఆలస్యంతో ప్రయాణికుల అవస్థలు

image

రాజమహేంద్రవరం (మధురపూడి) విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు కావడం, ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు ఇబ్బందులను చవి చూస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సిన విమాన సర్వీసులను, హైదరాబాద్ వెళ్లే రెండు సర్వీస్‌లను ఇండిగో సంస్థ రద్దు చేసింది. బెంగళూరు వెళ్లాల్సిన విమానం 7.15 గంటలకు రావాల్సి ఉండగా శుక్రవారంరాత్రి 11 గంటలకు వస్తుందని ప్రకటించారు. ముంబై వెళ్లే విమానాలు సైతం బాగా ఆలస్యంగా నడిచాయి.

News December 6, 2025

NGKL: జిల్లాలో 208 వార్డు స్థానాలు ఏకగ్రీవం

image

నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో 208 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 151 గ్రామ పంచాయతీల పరిధిలో 1326 వార్డులు ఉండగా అందులో 208 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 2,774 మంది వార్డు సభ్యులు ఎన్నికల బరిలో ఉన్నారు. వెల్దండ మండలంలో అత్యధికంగా 66 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడూరు మండలంలో 16 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

News December 6, 2025

రబీ నువ్వుల సాగు.. నేలలు, నాటే సమయం

image

మురుగునీటి పారుదల బాగా ఉన్న నల్లరేగడి లేదా తేలిక నేలలు నువ్వుల పంట సాగుకు అనుకూలం. ఆమ్ల, క్షార గుణాలు కలిగిన నేలలు ఈ పంట సాగుకు పనికిరావు. తగినంత తేమ నిలుపుకొనే ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు మరింత అనువైనవి. కోస్తా జిల్లాల్లో రబీలో/రబీ వేసవి పంటగా డిసెంబర్ రెండో పక్షం నుంచి జనవరి నెలాఖరు వరకు నువ్వులను విత్తుకోవచ్చు. విత్తుట ఆలస్యమైతే పంటకు వెర్రి తెగులు ఆశించి దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.