News March 25, 2025
రాజమండ్రిలో జంట హత్యలు.. అసలేం జరిగిందంటే.!

రాజమండ్రిలో జంట హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. DSP శ్రీవిద్య ఈ కేసులో కీలక విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళానికి చెందిన శివకుమార్, సుమియా లవర్స్. తండ్రి మృతిచెందగా ఆమె తల్లి సాల్మాతో రాజమండ్రిలో ఉంటోంది. సుమియా వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని శివ గొడవపడ్డాడు. ఆదివారం సుమియా మేడపైకి వెళ్లగా.. పడుకొని ఉన్న తల్లిని కత్తితో చంపేసి, తలుపు వెనుక ఉండి కూతురినీ చంపేశాడు. నిందితుడు అరెస్టయ్యాడు
Similar News
News December 13, 2025
IIBFలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్& ఫైనాన్స్(IIBF)లో 17 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ మేనేజ్మెంట్/IT/CS/కంప్యూటర్ అప్లికేషన్), డిప్లొమా(IIBF), M.Com/MA/MBA/CA/CMA/CFA, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.iibf.org.in
News December 13, 2025
(PMAY-G)-NTR స్కీమ్.. రేపటి వరకే ఛాన్స్

AP: PM ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువు రేపటితో(డిసెంబర్ 14) ముగియనుంది. దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం ₹2.50లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థికసాయం అందజేస్తారు.
News December 13, 2025
చంద్రబాబుపై ఫైబర్నెట్ కేసు కొట్టివేత

AP: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట కలిగింది. గత ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్నెట్ కేసును ACB కోర్టు కొట్టేసింది. ఇతర నిందితులకూ క్లీన్చిట్ ఇచ్చింది. 2014-19 మధ్య ఫైబర్నెట్లో ₹114Cr స్కామ్ జరిగిందని కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా CID అధికారులు ఆ కేసు దర్యాప్తును ముగించినట్లు కోర్టుకు తెలిపారు. కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని నాటి, నేటి ఫైబర్నెట్ MDలు చెప్పారు. దీంతో కోర్టు తీర్పు వెలువరించింది.


