News March 25, 2025

రాజమండ్రిలో జంట హత్యలు.. అసలేం జరిగిందంటే.!

image

రాజమండ్రిలో జంట హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. DSP శ్రీవిద్య ఈ కేసులో కీలక విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళానికి చెందిన శివకుమార్, సుమియా లవర్స్. తండ్రి మృతిచెందగా ఆమె తల్లి సాల్మాతో రాజమండ్రిలో ఉంటోంది. సుమియా వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని శివ గొడవపడ్డాడు. ఆదివారం సుమియా మేడపైకి వెళ్లగా.. పడుకొని ఉన్న తల్లిని కత్తితో చంపేసి, తలుపు వెనుక ఉండి కూతురినీ చంపేశాడు. నిందితుడు అరెస్టయ్యాడు

Similar News

News April 25, 2025

గణితంలోనే 3,934 మంది ఫెయిల్

image

ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలో 3,934 మంది విద్యార్థులు ఒక్క గణితంలోనే ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత సైన్సులో 2,555 విద్యార్థులు ఫెయిల్ కావడం గమనార్హం. గణితం ప్రశ్నా పత్రంలో లోపాలు ఉన్నప్పటికీ విద్యార్థులు ప్రయత్నం చేశారని, అయినా ఫలితాలు నిరాశ కలిగించాయని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రీ-వెరిఫికేషన్‌కు సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. 

News April 25, 2025

కుబీర్: ఇల్లరికం వచ్చి ప్రాణాలు తీసుకున్నాడు..!

image

అత్తారింటికి ఇల్లరికానికి వచ్చి భార్యతో గొడవపడి ఓ అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఉమ్రి గ్రామానికి చెందిన సురేశ్ కుబీర్ లోని అంతర్నీ గ్రామానికి చెందిన రోజాతో వివాహం జరిగింది. అయితే మంగళవారం భార్యాభర్తలు గొడవ పడ్డారు. భార్య బంధువుల ఇంటికి వెళ్లిపోవడంతో జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ తెలిపారు.

News April 25, 2025

భారత్ ఏం చేసినా మద్దతిస్తాం: ప్రపంచ నేతలు

image

పహల్‌గామ్ నరమేధానికి ప్రతీకారంగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తామని UK MP బాబ్ బ్లాక్‌మెన్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ మిలిటరీ యాక్షన్ చేపట్టినా తమ దేశంలోని పార్టీలన్నీ సపోర్ట్ చేస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ PM మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కష్టసమయంలో భారత్‌కు తమ దేశం అండగా ఉంటుందన్నారు.

error: Content is protected !!