News May 26, 2024
రాజమండ్రిలో దంపతుల అనుమానాస్పద మృతి

కాకినాడ జిల్లాకు చెందిన దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. జగ్గంపేటకు చెందిన శ్రీధర్(28), ప్రత్తిపాడులోని ఒమ్మంగికి చెందిన దేవి(24)కి 8ఏళ్ల కింద పెళ్లి జరిగింది. వీరికి బాబు(7). మూడేళ్లుగా రాజమండ్రిలో ఉంటున్నారు. గొడవల వల్ల దేవి వారం కింద పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. శ్రీధర్ వెళ్లి శనివారం తిరిగి తీసుకొచ్చాడు. సాయంత్రం బంధువు ఒకరు ఇంటికెళ్లి చూడగా.. దంపతులిద్దరూ చనిపోయి ఉన్నారు.
Similar News
News February 13, 2025
తూ.గో: ఈనెల 14న బహిరంగ వేలం

వివిధ ఘటనలో సీజ్ చేసిన 47,274 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఈనెల 14న గోపాలపురంలోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద బహిరంగ వేలం వేయనున్నట్లు JC చిన్నరాముడు ఒక ప్రకటనలో చెప్పారు. అదే రోజున దేవరపల్లిలో వెంకటేశ్వర రైస్ మిల్ వద్ద కూడా 16.00 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వేలం వేయనున్నట్లు చెప్పారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా రూ.5 వేలు ధరావత్తు చెల్లించాలన్నారు. కిలో బియ్యం రూ.22కి నిర్ణయించామన్నారు.
News February 13, 2025
కొవ్వూరులో హీరో రామ్ సినిమా షూటింగ్

సినీ హీరో రామ్ పోతినేని 22వ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో జరిగింది. మైత్రీ మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. మంగళవారం ఆరికిరేవుల స్నానఘట్టం, గోదావరి నది వద్ద సన్నివేశాలను చిత్రీకరించారు. మహేష్బాబు.పి దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్గా భాగ్యశ్రీ ,రావు రమేష్, బ్రహ్మానందం, హర్షవర్దన్లు నటిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.
News February 13, 2025
కొవ్వూరులో హీరో రామ్ సినిమా షూటింగ్

సినీ హీరో రామ్ పోతినేని 22వ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో జరిగింది. మైత్రీ మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. మంగళవారం ఆరికిరేవుల స్నానఘట్టం, గోదావరి నది వద్ద సన్నివేశాలను చిత్రీకరించారు. మహేష్బాబు.పి దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్గా భాగ్యశ్రీ ,రావు రమేష్, బ్రహ్మానందం, హర్షవర్దన్లు నటిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపారు.