News March 26, 2025

రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం

image

హైదరాబాద్‌కి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల <<15882715>>మృతదేహానికి <<>>పోస్టుమార్టం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ బందోబస్తు నడుమ బుధవారం నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులు సమక్షంలో వీడియో పర్యవేక్షణలో వైద్యులు పోస్టుమార్టం చేస్తున్నారు. ఇప్పటికే అధిక సంఖ్యలో క్రైస్తవ పెద్దలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News December 4, 2025

NRPT: భయాందోళనకు గురిచేసేందుకే క్షుద్రపూజలు

image

కోస్గి మండలంలోని మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో క్షుద్రపూజలు విద్యార్థులను భయాందోళన గురి చేసే అందుకే చేసి ఉంటారని పాఠశాల హెచ్ఎం జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇట్టి పూజలు చేసిన ఆకతాయిలకు పోలీసులు గుణపాఠం చెప్తారన్నారు. విద్యార్థులకు ధైర్యం చెప్పి పాఠశాలను కొనసాగించినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

News December 4, 2025

ఖమ్మం: ఎన్నికల్లో తల్లీకూతుళ్ల సమరం..!

image

ఖమ్మం జిల్లా: పెనుబల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన పోరు నెలకొంది. సర్పంచ్ పదవి కోసం తల్లి తేజావత్ సామ్రాజ్యం, కూతురు బానోతు పాప ప్రత్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. సొంత కుటుంబ సభ్యులే ఒకే పదవికి పోటీ పడుతుండటంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ ఆసక్తికరమైన పోరాటం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, విజయం ఎవరిని వరిస్తుందోనని స్థానికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

News December 4, 2025

వనపర్తి: 45 సర్పంచ్ నామినేషన్లు దాఖలు..!

image

వనపర్తి జిల్లాలో మూడో విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీలకు బుధవారం మొత్తం 45 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ చిన్నంబావిలోని 17 GPలకు – 9 నామినేషన్లు.
✓ పానగల్‌లోని 28 GPలకు – 15 నామినేషన్లు.
✓ పెబ్బేరులోని 20 GPలకు – 13 నామినేషన్లు.
✓ శ్రీరంగాపూర్‌లోని 8 GPలకు – 6 నామినేషన్లు.
✓ వీపనగండ్లలోని 14 GPలకు – 2 నామినేషన్లు దాఖలయ్యాయి.