News March 26, 2025

రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం

image

హైదరాబాద్‌కి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల <<15882715>>మృతదేహానికి <<>>పోస్టుమార్టం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ బందోబస్తు నడుమ బుధవారం నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులు సమక్షంలో వీడియో పర్యవేక్షణలో వైద్యులు పోస్టుమార్టం చేస్తున్నారు. ఇప్పటికే అధిక సంఖ్యలో క్రైస్తవ పెద్దలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News December 5, 2025

పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

image

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్‌ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వర్తించదు.

News December 5, 2025

KMR: జిల్లాలో 10 గ్రామ పంచాయతీల సర్పంచుల ఏకగ్రీవం

image

కామారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఘట్టం రసవత్తరంగా మారింది. 10 మండలాల పరిధిలోని 167 పంచాయతీలు, 1520 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. బుధవారంతో ఉపసంహరణ గడువు ముగియగా..10 గ్రామ పంచాయతీల సర్పంచ్ లు ఏకగ్రీవమైనట్లు DPO మురళి గురువారం వెల్లడించారు. మిగిలిన స్థానాల్లో పోటీ అనివార్యమవడంతో, ఆయా గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమయ్యారు.

News December 5, 2025

మెదక్: 3వ విడత 2వ రోజు 368 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో రెండవ రోజు 368 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-43, కౌడిపల్లి-59, కుల్చారం-48, మాసాయిపేట-18, నర్సాపూర్-75, శివంపేట-73, వెల్దుర్తి-52 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 1522 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నేడు చివరి రోజుకావడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.