News October 18, 2024
రాజమండ్రిలో 19న జాబ్ మేళా

రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో 19న ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం రాజమహేంద్రవరంలో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలకు SSC, ఇంటర్, ఐటీఐ, డిప్లమా, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.
Similar News
News November 12, 2025
కొవ్వూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్

కొవ్వూరు మండలం అరికిరేవుల వద్ద బుధవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్లో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరంలోని పిడుగుకు చెందిన వెంకటరమణ(50) మరణించారని సీఐ విశ్వ తెలిపారు. బైక్పై కొవ్వూరు నుంచి తాళ్లపూడికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 12, 2025
విద్యార్థిని అభినందించిన మంత్రి దుర్గేష్

నిడదవోలుకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్యా రెడ్డి నాసా ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం(ఐఏఎస్పీ)కి ఇటీవల ఎంపికైంది. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తూ..కుంచాల కైవల్య రెడ్డిని అభినందించారు. విద్యార్థిని తల్లిదండ్రులను నిడదవోలు టౌన్ రోటరీ ఆడిటోరియంలో బుధవారం కలిశారు.
News November 12, 2025
తూ.గో: ఎక్కడ ఎన్ని ఇళ్లంటే..!

తూ.గో జిల్లాలో 8,773 ఇళ్లలో గృహప్రవేశాలు బుధవారం జరగనున్నాయి. పీఎంఏవై బీఎల్సీ పథకం కింద 7,200, పీఎంఏవై గ్రామీణ పథకం కింద 1,573 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామని హౌసింగ్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాతి బుజ్జి తెలిపారు. రాజమండ్రిలో 375 ఇళ్లు, రాజానగరంలో 631, గోపాలపురంలో 1,760 ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు.


