News December 19, 2024

రాజమండ్రి: అధికారులకు కలెక్టర్ సూచనలు

image

 వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సంస్థాగత నిర్మాణం చేపట్టాలని తూ.గో. జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం రాజమండ్రి కలెక్టర్ ఛాంబర్ లో వాయు కాలుష్యంపై జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం, కాలుష్య నియంత్రణ మండలి, ఆర్ఎంసీ, రవాణా, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా నివారించడంలో ఉత్తమమైన పద్ధతులను అమలు చేయాలన్నారు.

Similar News

News December 8, 2025

తూ.గో: టెన్త్ విద్యార్థులకు సూచన

image

డిసెంబర్ 9 లోపు టెన్త్ పరీక్షా ఫీజు చెల్లించాలని డీఈవో వాసుదేవరావు తెలిపారు. జిల్లాలో టెన్త్ మార్చి -2026లో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు రెగ్యులర్ /2025 ఫెయిల్ అయిన విద్యార్థులు గమనించాలన్నారు. 10 – 12వ తేదీ లోపు రూ.50, 13-15వ తేదీ వరకు రూ.200, 16 – 18 వరకు రూ.2,500 ఫైన్‌తో చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్కూల్ లాగిన్ ద్వారానే ఫీజ్ చెల్లించాల్సి ఉంటుందన్నారు.

News December 8, 2025

పట్టు బిగిస్తున్న కందుల దుర్గేశ్

image

నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ పట్టు బిగిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నైనా సీటు త్యాగం చేసిన బూరుగుపల్లి శేషారావుకి మళ్లీ ఛాన్స్ ఇస్తారా? అన్నది సందేహంగానే ఉంది. ఇప్పటికే మున్సిపాలిటీలో జనసేన పాగా వేసింది. 6 పీఎసీఎస్, ఏఎంసీ, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో జనసేన ఆధిపత్యం నడుస్తోంది. మంత్రి వ్యూహాత్మకంగా జనసేనను బలోపేతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శేషారావు రాజకీయ భవిష్యత్తు చర్చనీయాంశం అయింది.

News December 8, 2025

నిడదవోలు మున్సిపాలిటీలో తారుమారైన పార్టీ బలాలు

image

నిడదవోలు మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. గత ఎన్నికల్లో 28 స్థానాలకు గాను 27 గెలుచుకున్న వైసీపీ బలం ప్రస్తుతం 12కు పడిపోయింది. ఒక్క కౌన్సిలర్ లేని జనసేన ఏకంగా 15 మంది సభ్యులతో పాటు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలను దక్కించుకుంది. ఇక్కడి జనసేన ఎమ్మెల్యే మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీకి కలిసొచ్చింది. ఇదే సమయంలో టీడీపీ ఇక్కడ ఉనికి కోల్పోవడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.