News March 12, 2025

రాజమండ్రి: ఆ రైళ్లు సికింద్రాబాద్ వెళ్లవు..!

image

సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు ముమ్మరం కావడంతో స్టేషన్‌కు వచ్చే 14 ముఖ్యమైన రైళ్ల రూటును మార్చేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. లింగంపల్లి- కాకినాడ స్పెషల్ (07445/07446) ఏప్రిల్ 2 నుంచి, లింగంపల్లి- విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805/12806) ఏప్రిల్ 25 నుంచి సికింద్రబాద్‌కు రాకుండానే చల్లపల్లి మీదుగా నడుస్తాయని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.

Similar News

News March 19, 2025

రాజానగరం: దివాన్ చెరువులో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

image

రాజమండ్రిలోని దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సూచనల మేరకు అకాడమీ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అనుమతి రావడంతో.. దివాన్ చెరువు వద్ద దాని ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక్కడ అకాడమీ ఏర్పాటు నిర్ణయం పట్ల స్థానిక ఎమ్మెల్యే బత్తుల హర్షం వ్యక్తం చేశారు.

News March 19, 2025

రాజమండ్రిలో సందడి చేసిన కోర్టు చిత్ర బృందం

image

రాజమండ్రిలోని స్వామిథియేటర్‌లో మంగళవారం ‘కోర్టు’ సినిమా యూనిట్‌ సందడి చేసింది. చిత్రంలో పులికొండ లాయర్‌ పాత్రపోషించిన ప్రియదర్శి, హీరో హర్షరోషన్, హీరోయిన్లు శ్రీదేవి,రిషిక, రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ రామ్‌ జగదీష్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తదితరులు పాల్గొని ప్రేక్షకులతో మాట్లాడారు. కోర్టు సినిమా అందర్ని గెలిపించిందన్నారు. మంచి చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను చూడాలన్నారు.

News March 19, 2025

రాజమండ్రీలో సందడి చేసిన కోర్టు చిత్ర బృందం

image

రాజమండ్రిలోని స్వామిథియేటర్‌లో మంగళవారం ‘కోర్ట్‌’ సినిమా యూనిట్‌ సందడి చేసింది. చిత్రంలో పులికొండ లాయర్‌ పాత్రపోషించిన ప్రియదర్శి, హీరో హర్షరోషన్, హీరోయిన్లు శ్రీదేవి,రిషిక, రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ రామ్‌ జగదీష్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తదితరులు పాల్గొని ప్రేక్షకులతో మాట్లాడారు. కోర్ట్‌ సినిమా అందర్ని గెలిపించిందన్నారు. మంచి చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను చూడాలన్నారు.

error: Content is protected !!