News February 3, 2025
రాజమండ్రి: ఇంటర్ యువతిపై లెక్చరర్ అత్యాచారం

ఇంటర్ అమ్మాయిపై లెక్చరర్ అత్యాచారం చేసిన ఘటన ఇది. కొవ్వూరుకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి రాజమండ్రిలో ఇంటర్ చదువుతోంది. అదే కాలేజీలో తిరుపతికి చెందిన వినయ్వర్ధన్ జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. గతనెల 28న ఆమెను విజయవాడ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతపురం, ఇతర ప్రాంతాల్లో తిరిగి భీమవరం వచ్చారు. తర్వాత అమ్మాయిని ఇంటికి పంపేయగా.. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News February 23, 2026
T20 WC: సెమీస్ చేరాలంటే ఇండియా ఏం చేయాలి?

సౌతాఫ్రికాతో మ్యాచ్లో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. 188 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగి కేవలం 111 రన్స్కే కుప్పకూలింది. దీంతో సెమీస్ ఆశలు సంకటంలో పడ్డాయి. టీమ్ఇండియా గట్టెక్కాలంటే తర్వాత జరిగే వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్ల్లో కచ్చితంగా గెలవాలి. ఒక్క మ్యాచ్లోనే గెలిస్తే మాత్రం మిగతా టీమ్స్ రిజల్ట్స్, నెట్ రన్ రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది. ‘సూర్య’సేన ఇక ప్రతి మ్యాచ్ను ‘డూ ఆర్ డై’లా ఆడాల్సిందే!
News February 23, 2026
IPL-2026లో ధోనీ ఆడతారా?

ధోనీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. IPLకు CSK మాజీ కెప్టెన్ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ఊహాగానాలకు తెరపడింది. IPL-2026 సీజన్లో మహీ ఆడతారని ఆ జట్టు CEO కాశీ విశ్వనాథన్ తెలిపారు. 2 సీజన్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి జట్టుకు మెంటార్గా ఉంటారని వార్తలు రాగా ఈ ప్రకటనతో క్లారిటీ వచ్చినట్లైంది. 44 ఏళ్ల ధోనీ CSKకు 5 ట్రోఫీలు అందించారు. ప్రస్తుతం ఆ జట్టుకు రుతురాజ్ సారథిగా ఉన్నారు.
News February 23, 2026
కల్తీ నెయ్యి అంశంపై అసెంబ్లీలో చర్చ?

AP: రాష్ట్రంలో కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఓ రోజు ఈ అంశంపై చర్చ జరపాలని యోచిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే అసెంబ్లీ తర్వాత మండలిలోనూ చర్చ పెట్టాలని భావిస్తోందట. ఈ అంశంపై అధికారికంగా తన వైఖరిని వెల్లడించడంతో పాటు అవసరమైన చర్యలపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


