News February 5, 2025

రాజమండ్రి: ఇంటర్, 10వ తరగతి పరీక్షలపై కలెక్టర్ సమావేశం

image

తూ.గో జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 43,754 మంది 51 పరీక్షా కేంద్రాల్లో, 10వ తరగతి పరీక్షలకు 25,723 మంది 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News February 6, 2025

గోకవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

కొత్తపల్లి నుంచి కామరాజుపేట వెళ్లే జంక్షన్ వద్ద గురువారం బైక్ అదుపుతప్పి రోడ్డుపై యువకుడు పడిపోయాడు. దీంతో అతడి తలకు బలంగా దెబ్బ తగిలినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108కు కాల్ చేసి గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 6, 2025

నిడదవోలు: జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య 

image

నిడదవోలు చిన్నకాశీరేవులో చాగల్లు మండలం నందిగంపాడు గ్రామానికి చెందిన ఆతుకూరి లింగేశ్వరరావు(44) అనే వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. 10 ఏళ్ల నుంచి భార్య తనతో విడిపోయి దూరంగా ఉంటుందనే బాధతో మద్యానికి బానిసై జీవితం మీద విరక్తి చెంది చిన్నకాశీరేవులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. కందుల దుర్గేష్‌కు 2వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. తూ.గో. జిల్లా మంత్రి కందుల దుర్గేష్‌కు 2వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం సూచించారు.

error: Content is protected !!