News April 9, 2025
రాజమండ్రి: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మహిళ మోసం

ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ మహిళ నలుగురు వ్యక్తులకు టోకరా వేసిన ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. స్థానిక జీజీహెచ్లో తనకు అధికారులు తెలుసునని..ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.6.50లక్షలు వసూలు చేసింది. అనంతరం ఆమె ముఖం చాటేయడంతో మోసపోయామని తెలుసుకున్న నలుగురు బాధితులు మంగళవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.లక్ష్మి సూర్యప్రభకు వారు ఫిర్యాదు చేయగా ఘటనపై ఆమె ఎంక్వైరీ ప్రారంభించారు.
Similar News
News December 7, 2025
తూ.గో: గగనతలంలో ‘తూర్పు’ ఆశలు!

నేడు ‘అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం’. ఈ నేపథ్యంలో తూ.గో. వాసుల ఆకాంక్షలు బలంగా వినిపిస్తున్నాయి. మధురపూడి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించాలన్నది ప్రజల చిరకాల స్వప్నం. కడియం పూల గుబాళింపులు విదేశాలకు చేరేలా ‘కార్గో’ సేవలు విస్తరించాలని, గోదావరిపై సీప్లేన్ పర్యాటకం కొత్త పుంతలు తొక్కాలని కోరుతున్నారు. వాణిజ్య, పర్యాటక అభివృద్ధికి విమానయాన రంగం ఊతమివ్వాలని ఆశిస్తున్నారు.
News December 7, 2025
రాజమండ్రి విద్యార్థి సూపర్ టాలెంట్

రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్లోని శ్రీనివాస రామానుజం మున్సిపల్ హైస్కూల్కు చెందిన ఎం.సంజయ్ కుమార్ (10వ తరగతి) యోగా అండర్-17 బాలుర విభాగంలో ప్రతిభ చూపాడు. బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విన్నర్గా నిలిచిన సంజయ్, జనవరిలో త్రిపురలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం పీకే ఎన్ సత్యవతి తెలిపారు. పీఈటీ డి. విజయ్ విక్టర్, ఉపాధ్యాయులు సంజయ్ని అభినందించారు.
News December 7, 2025
రాజమండ్రి విద్యార్థి సూపర్ టాలెంట్

రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్లోని శ్రీనివాస రామానుజం మున్సిపల్ హైస్కూల్కు చెందిన ఎం.సంజయ్ కుమార్ (10వ తరగతి) యోగా అండర్-17 బాలుర విభాగంలో ప్రతిభ చూపాడు. బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విన్నర్గా నిలిచిన సంజయ్, జనవరిలో త్రిపురలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం పీకే ఎన్ సత్యవతి తెలిపారు. పీఈటీ డి. విజయ్ విక్టర్, ఉపాధ్యాయులు సంజయ్ని అభినందించారు.


