News March 18, 2025

రాజమండ్రి: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సభ్యుల క్రీడా పోటీలు

image

ఎమ్మెల్యేలకు,ఎమ్మెల్సీలకు ఆహ్లాదాన్ని ఇచ్చే దిశగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. క్రీడా పోటీల కోసం జరుగుతున్న ఏర్పాట్లను శాప్ ఛైర్మన్ రవి నాయుడుతో కలిసి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు సోమవారం పర్యవేక్షించారు. ఈ క్రీడా పోటీల్లో 173మంది ఎమ్మెల్యేలు, 31మంది క్రికెట్, 25 మంది బ్యాట్మెంటిన్ వాలీబాల్ ఆడనున్నారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు.

Similar News

News March 18, 2025

కడియం: బాలికతో అసభ్యకర ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

image

కడియం మండలంలోని ఓ గ్రామానికి చెందిన చిన్న(60) మనవరాలు వరుసయ్యే బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధిత బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. తండ్రి అనారోగ్యంతో చనిపోగా.. తల్లి వేరే దేశంలో ఉంటోంది. బంధువుల ఇంటి వద్ద ఉంటున్న బాలికపై సదరు వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు.

News March 17, 2025

రాజమండ్రి: భానుడి భగభగ

image

తూ.గో. జిల్లాలో అప్పుడే ఎండ దంచేస్తుంది. కొన్ని మండలాల్లో వడగాలుల వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం రాజమండ్రిలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది. వడ గాల్పులతో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు జాగ్రత్తలు తీసుకుని బయటికి రావాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

News March 17, 2025

రాజమండ్రి: రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ నిర్వహణ

image

ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పీజీఆర్‌ఎస్ కార్యక్రమం మార్చి 17 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్, డివిజన్, మండల కేంద్రం, మున్సిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పరిధిలోని సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు.

error: Content is protected !!