News January 3, 2025

రాజమండ్రి : ‘గేమ్ ఛేంజర్’ పాసుల కోసం నాయకుల చుట్టూ ప్రదక్షిణలు

image

రాజమండ్రిలో జరగబోయే గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసేందుకు మెగా ఫ్యాన్ రెడీ అవుతున్నారు. ఈవెంట్ పాసులు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం లోకల్ లీడర్ల చుట్టూ మెగాభిమానులు, జనసైనికులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే అందరికీ పాస్‌లు అందించలేక నాయకులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.

Similar News

News November 19, 2025

ప్రతి 3వ శుక్రవారం ఫిర్యాదులకు అవకాశం: కలెక్టర్

image

ఉద్యోగుల ఫిర్యాదుల దినోత్సవంలో భాగంగా ప్రతి మూడవ శుక్రవారం ఉద్యోగులు తమ వ్యక్తిగత సమస్యలు సహా అన్ని రకాల ఫిర్యాదులను నేరుగా సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ప్రకటించారు. అందిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేక ఐడీతో పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రత్యేక నంబర్ ద్వారా ఉద్యోగి తన ఫిర్యాదు స్థితిని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.

News November 19, 2025

నేడు అన్నదాత సుఖీభవ నిధులు జమ: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన 1,14,991 మంది రైతులకు PM-KISAN 21, అన్నదాత సుఖీభవ–2 పథకాల కింద మొత్తం రూ.7,699.90 లక్షల నిధులు జమ కానున్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేరకు బుధవారం నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్.ఎస్.కే స్థాయి వరకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

News November 19, 2025

నేడు అన్నదాత సుఖీభవ నిధులు జమ: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన 1,14,991 మంది రైతులకు PM-KISAN 21, అన్నదాత సుఖీభవ–2 పథకాల కింద మొత్తం రూ.7,699.90 లక్షల నిధులు జమ కానున్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేరకు బుధవారం నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్.ఎస్.కే స్థాయి వరకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.