News February 27, 2025
రాజమండ్రి: నదీజలాలను సంరక్షించండి- కమిషనర్

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నదీ జలాలను సంరక్షించే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. ప్రజలందరూ దీనిలో పాల్గొనాలని కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు డ్రాయింగ్ పోటీలు, బోట్ రేస్, మ్యూరల్ పెయింటింగ్, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు నోడల్ అధికారిగా ఇంజినీర్ షేక్ మదర్షా అలీని కమిషనర్ నియమించారు.
Similar News
News March 25, 2025
కొంతమూరు: ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి

కొంతమూరు హైవే సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల (45) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నివాసి అయిన పాస్టర్ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి వ్యక్తిగత పనులు నిమిత్తమై బైక్పై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన చనిపోయారు. దీంతో నగరంలో ఉన్న పాస్టర్లు అందరూ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి చేరుకున్నారు.
News March 25, 2025
రాజమండ్రిలో జంట హత్యలు.. అసలేం జరిగిందంటే.!

రాజమండ్రిలో జంట హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. DSP శ్రీవిద్య ఈ కేసులో కీలక విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళానికి చెందిన శివకుమార్, సుమియా లవర్స్. తండ్రి మృతిచెందగా ఆమె తల్లి సాల్మాతో రాజమండ్రిలో ఉంటోంది. సుమియా వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని శివ గొడవపడ్డాడు. ఆదివారం సుమియా మేడపైకి వెళ్లగా.. పడుకొని ఉన్న తల్లిని కత్తితో చంపేసి, తలుపు వెనుక ఉండి కూతురినీ చంపేశాడు. నిందితుడు అరెస్టయ్యాడు.
News March 25, 2025
పెరవలి : చికెన్ కోసం వెళ్లి ఇద్దరు మృతి

అన్నవరప్పాడు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టి , పిట్టల వేమవరం గ్రామానికి చెందిన మాకా సురేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హనుమంతు కూడా కన్నుమూశాడు. అయితే వారు ఇరువురూ చికెన్ కోసం అన్నవరప్పాడుకు వెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు. ఘటనపై ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.