News November 16, 2024
రాజమండ్రి నుంచి పోలీసుల కస్టడీలోకి బోరుగడ్డ అనిల్

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్ను జంగారెడ్డిగూడెం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతను గుంటూరులో ఓ వ్యక్తిని రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే అదే సమయంలో JRGలోని వేలురుపాడు పోలీస్ స్టేషన్లో అతనిపై మరోకేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో శుక్రవారం జంగారెడ్డిగూడెం పోలీసులు రాజమండ్రి నుంచి రెండురోజుల కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు.
Similar News
News February 11, 2026
రాజమండ్రి: వికసిత భారత్ కమిటీ ఛైర్పర్సన్గా పురందేశ్వరి

‘వికసిత భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు- 2025’ సంయుక్త కమిటీ ఛైర్పర్సన్గా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు. 2047 నాటికి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ, వికసిత భారత్ లక్ష్య సాధన కోసం కమిటీ సభ్యులతో కలిసి అంకితభావంతో కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
News February 11, 2026
రాజమండ్రి: తిట్టిన వారికి సెంట్రల్ జైలా?

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, కురసాల కన్నబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ.. “కొట్టిన వారికి స్టేషన్ బెయిలు, తిట్టిన వారికి సెంట్రల్ జైలు” అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై స్పందిస్తూ.. తప్పు జరిగినట్లు తేలితే ‘దైవ ద్రోహం’ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
News February 11, 2026
పట్టిసీమ: వీరభద్రేశ్వరుడుని దర్శించుకున్న ప్రముఖ సినీ రచయిత

ప్రసిద్ధ శైవక్షేత్రమైన పట్టిసీమ శ్రీ వీరభద్రేశ్వర స్వామిని రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త వీరభద్రరావుతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజానగరం ఇన్ఛార్జి వీరన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.


