News April 1, 2025
రాజమండ్రి: పాస్టర్ ప్రవీణ్ కేసు.. ముమ్మరంగా దర్యాప్తు

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు రోజుకో మిస్టరీగా మారుతోంది. ప్రవీణ్ చనిపోకముందు బైక్పై HYD నుంచి రాజమండ్రి వచ్చే క్రమంలో పలుచోట్ల బైక్ నుంచి పడిపోయినట్లు ఉన్న దృశ్యాలు SMలో వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఉన్నది ప్రవీణ్ అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. అసలు అతడిది హత్యనా? లేక రోడ్డు ప్రమాదమా? అనేది తేలాల్సి ఉంది. ఈ కేసును ఛేదించేందుకు డీఎస్పీ సహా ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.
Similar News
News December 5, 2025
నెల్లూరు: భారీ వర్షాలకు ఒకరు మృతి.. మరొకరు గల్లంతు..

నెల్లూరు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. నెల్లూరు పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి మస్తాన్ గురువారం పొట్టెపాలెం కలుజులో పడి మృతి చెందాడు. నెల్లూరు శివారు ప్రాంతం కొండ్లపూడికి చెందిన రవికుమార్ బుధవారం సాయంత్రం నెల్లూరు కాలువలో గల్లంతయ్యారని సమాచారం. తండ్రి గల్లంతైనట్లు రవికుమార్ కుమార్తె కావ్య గురువారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News December 5, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 5, 2025
పల్లె టు కాశ్మీర్.. సరిహద్దులో కొండంరాజుపల్లి బిడ్డ

సిద్దిపేట జిల్లా కొండంరాజపల్లి గ్రామానికి బండి లక్ష్మి- తిరుపతి దంపతుల కుమారుడు బండి శ్రీనివాస్ అగ్నివీర్ పథకంలో దేశసేవకు అంకితమయ్యాడు. బెంగళూరులో ఆరు నెలల కఠోర శిక్షణను పూర్తి చేసిన శ్రీనివాస్ కల ఉద్యోగ పట్టాను అందుకున్నాడు. అతని పట్టుదలతో కాశ్మీర్లో దేశ సేవలకు వెళ్తున్నాడు. ఈ విజయం పట్ల స్వగ్రామంలో ఆనందం నెలకొంది.


