News April 6, 2025

రాజమండ్రి: ‘పోలీసుల విచారణను నేను నమ్మను’

image

పాస్టర్ ప్రవీణ్‌ది హత్యా?.. ప్రమాదమా అన్నది ప్రభుత్వం తేల్చాలని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రవీణ్ మరణించి రెండు వారాలు గడిచినా, నేటికీ పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేసులో విచారణను కుటుంబ సభ్యులు నమ్ముతున్నా..తాను నమ్మనన్నారు. తనపై పెట్టిన కేసులకు భయపడేది లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News December 9, 2025

BSWD: “మా కుటుంబ ఓట్లు అమ్మబడవు”

image

బాన్సువాడ నియోజకవర్గం, మోస్రా మండలం గోవూర్‌లో ఎన్నికల నేపథ్యంలో నవీన్ రెడ్డి వినూత్న రీతిలో ప్లెక్సీ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులను ఉద్దేశించి, “మా కుటుంబ ఓట్లు అమ్మబడవు” అని ఇంటి వద్ద ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ఓటుకు నోటు తీసుకోకుండా, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.

News December 9, 2025

PHC స్థాయిలోనే స్క్రబ్ టైఫ‌స్ నిర్ధారణ పరీక్షలు

image

AP: స్క్రబ్ టైఫ‌స్ జ్వరాల నిర్ధారణ పరీక్షల నమూనాలను PHC స్థాయిలోనే సేకరిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,566 స్క్రబ్ టైఫ‌స్ జ్వరాల కేసులు నమోదైనట్లు చెప్పారు. 9 మరణాలూ అనుమానిత కేసులు మాత్రమే అని, లోతైన పరీక్షలకు జీనోమ్ సీక్వెన్స్ చేయిస్తున్నామన్నారు. కుట్టినట్లు అనిపించిన శరీర భాగంపై నల్లటి మచ్చ కనిపిస్తే అప్రమత్తం కావాలని సూచించారు.

News December 9, 2025

‘పరీక్షా పే చర్చ’.. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం

image

‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పశ్చిమ, ఏలూరు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. పశ్చిమ గోదావరికి ఎం.విజయప్రసన్న, బి.జాన్సన్‌లు, ఏలూరు జిల్లాకు వై.స్వరాజ్యశ్రీనివాస్, సీహెచ్ గోవిందరాజులు, శామ్యూల్‌ సంజీవ్‌లు ఎంపికయ్యారు. ఈనెల 11వ తేదీ వరకు జరిగే రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించాలని ఆమె సూచించారు.