News April 6, 2025
రాజమండ్రి: ‘పోలీసుల విచారణను నేను నమ్మను’

పాస్టర్ ప్రవీణ్ది హత్యా?.. ప్రమాదమా అన్నది ప్రభుత్వం తేల్చాలని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రవీణ్ మరణించి రెండు వారాలు గడిచినా, నేటికీ పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేసులో విచారణను కుటుంబ సభ్యులు నమ్ముతున్నా..తాను నమ్మనన్నారు. తనపై పెట్టిన కేసులకు భయపడేది లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News October 16, 2025
నచ్చిన ఫుడ్ ఇష్టమొచ్చినట్లు తినేస్తున్నారా?

చాలామంది ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కారు. నచ్చిన టిఫిన్ అనో, నాన్ వెజ్ కూరనో ఆకలితో సంబంధం లేకుండా పరిమితికి మించి లాగించేస్తుంటారు. కొందరైతే ఫేవరెట్ ఫుడ్ కనిపిస్తే ఇష్టమొచ్చినట్లు తినేస్తారు. అలాంటి వాళ్లు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ‘ఆహారం మితంగా తింటేనే ఆరోగ్యం.. అతిగా తింటే ఆయుక్షీణం’. అందుకే టిఫిన్, లంచ్, బ్రేక్ ఫాస్ట్ ఏదైనా కంట్రోల్డ్గా తీసుకోండి. ఇవాళ ప్రపంచ ఆహార దినోత్సవం.
News October 16, 2025
SRD: NMMSకు దరఖాస్తు గడువు పొడిగింపు

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువును ఈనెల 18 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులు https://bse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ.1000 చొప్పున నాలుగేళ్లు ఉపకార వేతనం అందిస్తారని పేర్కొన్నారు.
News October 16, 2025
బీర్ బాటిళ్లకూ బార్ కోడ్ పెట్టండి: చంద్రబాబు

AP: రాష్ట్రంలో ఎక్సైజ్ సురక్షా యాప్ను ఇప్పటివరకు 27 వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు అధికారులు CM చంద్రబాబుకు తెలిపారు. యాప్ స్కాన్ ద్వారా చేస్తున్న విక్రయాల్లో ఒక్క నకిలీ మద్యం బాటిల్ కూడా వెలుగు చూడలేదన్నారు. మరింత పకడ్బందీగా వ్యవస్థను తయారు చేయాలని CM ఆదేశించారు. త్వరలో బీర్ బాటిళ్లకు కూడా బార్కోడ్ పెట్టాలని తెలిపారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.