News April 6, 2025

రాజమండ్రి: ‘పోలీసుల విచారణను నేను నమ్మను’

image

పాస్టర్ ప్రవీణ్‌ది హత్యా?.. ప్రమాదమా అన్నది ప్రభుత్వం తేల్చాలని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రవీణ్ మరణించి రెండు వారాలు గడిచినా, నేటికీ పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేసులో విచారణను కుటుంబ సభ్యులు నమ్ముతున్నా..తాను నమ్మనన్నారు. తనపై పెట్టిన కేసులకు భయపడేది లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News December 6, 2025

నంద్యాల: ‘అమ్మా, నాన్న ఆశీర్వదించండి’

image

బండి ఆత్మకూరులోని ఏపీ మోడల్ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ సమావేశం సందర్భంగా పదో తరగతి విద్యార్థి ముబీనా వేసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం అనే సూక్తిలో మొదటి రెండు స్థానాలు తల్లిదండ్రులవే. అందులో భాగంగా చిన్నారులు తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ ఆశీర్వాదం పొందుతున్న చిత్రాన్ని చూసిన అతిథులు.. ముబీనాను అభినందించారు.

News December 6, 2025

కృష్ణా: వర్క్ ఫ్రమ్ హోమ్ పరీక్షలపై అవగాహన కల్పించరా.?

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల కోసం అన్ని సచివాలయాల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. DEC 2-6 మధ్య తొలివిడత పరీక్షలు జరుగుతుండగా, ఎన్టీఆర్ జిల్లాలో 84 వేలు, కృష్ణాలో 50 వేల మంది అర్హులున్నారు. అయితే కొందరు నిరుద్యోగులు తమకు సమాచారం లేదని వాపోతున్నారు. అధికారులు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి కంపెనీలు జాబ్స్ ఇవ్వనున్నాయి.

News December 6, 2025

కొర్రగుంటపాలెం పంచాయతీ కార్యదర్శిపై DLPO విచారణ

image

ముదినేపల్లి మండలం కొర్రగుంటపాలెం పంచాయతీ కార్యదర్శి జె.గిరిజ 15వ ఆర్ధిక సంఘం నిధులు దుర్వినియోగం చేసినట్లు గ్రామస్తులు చంద్రకాంత్.. కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదుపై శుక్రవారం విచారణ చేపట్టారు. DLPO అమ్మాజీ పంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించి వివరాలు సేకరించారు. కార్యదర్శి గిరిజ తనకు అనుకూలమైన వారిని వెండర్లుగా సృష్టించి ఆర్ధిక సంఘం నిధులను దుర్వినియోగం చేసినట్లు చంద్రకాంత్ DLPOకు తెలిపారు.