News January 29, 2025

రాజమండ్రి: ఫిబ్రవరి 1 ముఖ్యమంత్రి పర్యటన రద్దు

image

ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా లకి చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో జిల్లాలో ఫిబ్రవరి 1 వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన అన్నమయ్య జిల్లాకు మార్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి బుధవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. పూర్వపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తక్షణం ఎన్నికల నియామవళి అమలులోకి వచ్చిందని ఆమె తెలిపారు. అధికారులు గమనించాలన్నారు.

Similar News

News October 21, 2025

రాజమండ్రిలో ‘పోలీస్ కమేమరేషన్ డే’

image

రాజమండ్రిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన ‘పోలీస్ కమేమరేషన్ డే’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమరులైన పోలీసు సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొని అమరులకు పుష్పాంజలి ఘటించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కందుల అన్నారు.

News October 21, 2025

అమరవీరుల త్యాగాలు మరువలేనివి: తూ.గో. ఎస్పీ

image

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకుంటూ ఈ నెల 21న (మంగళవారం) పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. శాంతియుత సమాజం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని వారి త్యాగనిరతి అద్భుతమని ఆయన కొనియాడారు.

News October 19, 2025

తాళ్లపూడిలో నేటి చికెన్ ధరలు ఇలా!

image

తాళ్లపూడి మండల వ్యాప్తంగా చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో కిలో చికెన్ కిలో రూ.200 – 220 మధ్య విక్రయిస్తున్నారు. నాటుకోడి కిలో రూ.600, మేక మాంసం కిలో రూ.800 వద్ద అమ్మకాలు జరిగాయి. మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కావడం, స్వామి మాలధారులు పెరగడంతో వచ్చే వారం చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.