News January 28, 2025
రాజమండ్రి: బాలల సంరక్షణ గృహానికి నిందితుడు

రాజమండ్రి వీరభద్రపురంలో ఈ నెల 24వ తేదిన జరిగిన కిలారి పోతురాజు హత్య ఘటనలో నిందితుడు మైనర్ కావడంతో అతడిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పారావు తెలిపారు. న్యాయమూర్తి ఆదేశాలు మేరకు బాలల సంరక్షణ గృహానికి తరలించామన్నారు. పోతురాజు హత్యపై దర్యాప్తు చేసి బాలుడిని నిందితుడుగా గుర్తించామన్నారు. ఈ హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధమని ఇన్స్పెక్టర్ తెలిపారు.
Similar News
News November 10, 2025
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి: ఎస్పీ

ప్రజావాణి ఫిర్యాదులపై పోలీసు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 8 ఫిర్యాదులు వచ్చాయని.. అందులో భూతగాదాలు-04, పరస్పర గొడవలకు సంబంధించి-4 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు.
News November 10, 2025
నిర్మల్: రక్షణ కిట్లను అందజేసిన కలెక్టర్

నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులకు రక్షణ కిట్లను అందజేశారు. భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ఉపయోగపడతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమయ్యే పరికరాలు ఈ కిట్లో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణీ, జడ్పీ సీఈవో గోవింద్ పాల్గొన్నారు.
News November 10, 2025
మార్కెట్కు సెలవు: పెను ప్రమాదమే తప్పింది!

ఢిల్లీలో జరిగిన భారీ పేలుడులో పెను ప్రమాదమే తప్పింది. బ్లాస్ట్ జరిగిన ఎర్రకోట మెట్రో సమీపంలోని చాందినీ చౌక్లో ఓల్డ్ లజపత్ రాయ్ మార్కెట్ ఉంటుంది. సహజంగా ఆ మార్కెట్ అత్యంత రద్దీగా ఉంటుంది. అయితే సోమవారం దానికి సెలవు కావడంతో ఆ ప్రాంతంలో జన సాంద్రత కాస్త తక్కువగా ఉంది. లేదంటే మృతుల సంఖ్య భారీగా నమోదయ్యేది. మార్కెట్ను రేపు కూడా మూసేస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజయ్ భార్గవ్ ప్రకటించారు.


