News January 28, 2025
రాజమండ్రి: బాలల సంరక్షణ గృహానికి నిందితుడు

రాజమండ్రి వీరభద్రపురంలో ఈ నెల 24వ తేదిన జరిగిన కిలారి పోతురాజు హత్య ఘటనలో నిందితుడు మైనర్ కావడంతో అతడిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పారావు తెలిపారు. న్యాయమూర్తి ఆదేశాలు మేరకు బాలల సంరక్షణ గృహానికి తరలించామన్నారు. పోతురాజు హత్యపై దర్యాప్తు చేసి బాలుడిని నిందితుడుగా గుర్తించామన్నారు. ఈ హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధమని ఇన్స్పెక్టర్ తెలిపారు.
Similar News
News November 23, 2025
వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం.. IBSA నాయకులతో మోదీ

జొహనెస్బర్గ్లో జరుగుతున్న G20 సమ్మిట్లో IBSA (ఇండియా-బ్రెజిల్-సౌతాఫ్రికా) నాయకులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా ద సిల్వాలకు IBSA డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్, IBSA ఫండ్ ఫర్ క్లైమేట్ రెసిలియెంట్ అగ్రికల్చర్ ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. 40 దేశాల్లో విద్య, హెల్త్, మహిళా సాధికారతకు IBSA ఇస్తున్న మద్దతును ప్రశంసించారు.
News November 23, 2025
వరంగల్: నగలతో ఉడాయించిన నిత్య పెళ్లికూతురు..!

పెళ్లయి 16 ఏళ్ల కూతురు ఉన్నా తనకింకా పెళ్లి కాలేదని నమ్మించింది. పలు మ్యాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్ పెట్టి అమాయకులను పెళ్లి చేసుకొని, అనంతరం అందినకాడికి డబ్బు, నగలతో ఉడాయిస్తున్న నిత్య పెళ్లికూతురు తాజాగా తన ప్రతాపాన్ని చూపించింది. వరంగల్(D) పర్వతగిరి(M)లోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని గత నెలలో పెళ్లిచేసుకుని ఇంట్లో ఉన్న నగలతో పదిరోజుల క్రితం పరారైనట్లు సమాచారం. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
News November 23, 2025
తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

తిరుపతి SP ఆఫీసులో సోమవారం జరగాల్సిన PGRS (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు SP సుబ్బరాయుడు తెలిపారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పంచమి తీర్థం (చక్రస్నానం) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని SP కోరారు.


