News November 10, 2024
రాజమండ్రి: రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్గా కుడుపూడి సత్తిబాబు

ఏపీ శెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి రాజమండ్రికి చెందిన కుడుపూడి సత్తిబాబుకు దక్కింది. సత్తిబాబు టీడీపీ తెలుగు యువత, బీసీ సెల్ విభాగాలలో కీలకంగా పని చేశారు. టీడీపీ బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్గా, శ్రీశైలం గౌడ సత్రం డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. తన తల్లి సరస్వతీ పేరిట సరస్వతమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు.
Similar News
News September 18, 2025
రాజమండ్రి: నూతన కలెక్టర్ను కలిసిన జిల్లా ఎస్పీ

తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని గురువారం రాజమండ్రి కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతలపై ఇరువురు చర్చించుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలిసి పనిచేస్తామని వారు పేర్కొన్నారు.
News September 18, 2025
మెగా డీఎస్సీ అభ్యర్థులకు నేడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ

మెగా డీఎస్సీ నియామక పత్రాలు జారీ ప్రక్రియ 19వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డీఈవో వాసుదేవరావు బుధవారం తెలిపారు. టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులందరూ 18వ తేదీన ఒక సహాయకునితో రాజమండ్రిలో కేటాయించిన పాఠశాలలకు రెండు పాస్ పోర్ట్ ఫోటోలు, ఆధార్ కాల్ లెటర్తో సాయంత్రం 4 గంటలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, బస్సుల్లో విజయవాడ పంపుతామన్నారు.
News September 18, 2025
పీహెచ్డీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: వీసీ

యూజీసీ నెట్, జేఆర్ఎఫ్, సీఎస్ఐఆర్ నెట్ లలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీహెచ్డీ ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. యూనివర్సిటీలో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బుధవారం ఆమె వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్సైట్లో చూడవచ్చని సూచించారు.