News March 17, 2025

రాజమండ్రి: రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ నిర్వహణ

image

ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పీజీఆర్‌ఎస్ కార్యక్రమం మార్చి 17 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్, డివిజన్, మండల కేంద్రం, మున్సిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పరిధిలోని సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు.

Similar News

News November 30, 2025

దోసకాయలపల్లిలో దారుణ హత్య

image

కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిల్లి ఆనంద్‌ (30)ను కత్తితో నరికి దారుణంగా హత్య చేశారు. వరుసకు బంధువు అయిన ములకల్లంకకు చెందిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి పరారైనట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News November 30, 2025

రాజమండ్రి: నేటి మాంసం ధరలు ఇలా!

image

వారాంతం కావడంతో మాంసాహార దుకాణాలు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. రాజమండ్రి మార్కెట్లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 250, స్కిన్‌తో రూ. 230గా ఉంది. లైవ్ కోడి ధర రూ.140 నుంచి రూ.150 వరకు లభిస్తోంది. ఇక, కేజీ మటన్ ధర రూ. 900కు విక్రయిస్తున్నారు. ప్రాంతాలవారీగా ధరలలో స్వల్ప తేడాలున్నాయి. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 29, 2025

రాజమండ్రి: ‘సెలవుల్లోనూ.. విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు’

image

విద్యుత్ బిల్లులు వసూళ్ల కౌంటర్లు ఆదివారం కూడా పని చేస్తాయని APEPDCL సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.తిలక్ కుమార్ తెలిపారు. రెవెన్యూ కార్యాలయాలతో పాటు APEPDCL సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, A.T.P సెంటర్‌లలో కూడా బిల్లులు ఆదివారం చెల్లించవచ్చని తెలిపారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.