News October 24, 2024
రాజమండ్రి: రైళ్లు రద్దు.. హెల్ప్ డెస్క్ నంబర్లివే.!

దానా తుఫాను నేపథ్యంలో తూ.గో. జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. 30రైళ్లకు పైగా రద్దు కాగా, ఈ నెల 25వరకు వాటిని పునరుద్ధరించే అవకాశం లేనట్లు కన్పిస్తోంది. దీంతో సికింద్రాబాద్, వైజాగ్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలు స్టేషన్లలో అధికారులు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు.* రాజమండ్రి: 0883- 2420541* నిడదవోలు: 08813- 223325* సామర్లకోట: 088-42327010
Similar News
News July 6, 2025
పేరెంట్స్ డే నిర్వహణకు సమాయత్వం కావాలి: కలెక్టర్

జులై 10న ప్రభుత్వం నిర్వహించే పేరెంట్స్ డే నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్వం కావాలని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో మెగా పేరెంట్స్ డే, టీచర్స్ మీటింగ్, పి4 సర్వే, అన్నదాత సుఖీభవపై జిల్లా అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు అన్ని యాజమాన్యాల్లో ఉన్న స్కూళ్లలో పేరెంట్స్ డే నిర్వహిస్తామన్నారు. జేసీ కార్యచరణ ప్రణాళిక వివరించారు.
News July 5, 2025
పేరెంట్స్ డే నిర్వహణకు సమాయత్వం కావాలి: కలెక్టర్

జులై 10న ప్రభుత్వం నిర్వహించే పేరెంట్స్ డే నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్వం కావాలని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో మెగా పేరెంట్స్ డే, టీచర్స్ మీటింగ్, పి4 సర్వే, అన్నదాత సుఖీభవపై జిల్లా అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు అన్ని యాజమాన్యాల్లో ఉన్న స్కూళ్లలో పేరెంట్స్ డే నిర్వహిస్తామన్నారు. జేసీ కార్యచరణ ప్రణాళిక వివరించారు.
News July 5, 2025
కొవ్వూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

కొవ్వూరు రైల్వే స్టేషన్ శివారున గుర్తు తెలియని (35) ఏళ్ల వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్ఐ పి.అప్పారావు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10 గంటల మధ్య సమయంలో రైలు నుంచి జారిపడి మరణించి ఉండొచ్చని ఎస్ఐ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, వివరాల కోసం 9347237683 నంబర్ను సంప్రదించాల్సిందిగా కోరారు.