News March 27, 2025

రాజమండ్రి : వెంటిలేటర్‌పై అంజలి

image

రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన <<15888553>>అంజలి వెంటిలేటర్<<>> పైనే చికిత్స పొందుతోంది. దీనికి ఏజీఎం దీపక్‌నే కారణమని విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రకాశ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి కుటుంబీకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యంలో ఏమాత్రం మెరుగులేదని వైద్యులు తెలిపారు. కాగా ఆమె తల్లిదండ్రులు తమ కూతురు బతికి వస్తుందని, రావాలని ఆశతో ఎదురుచూస్తున్నారు

Similar News

News October 23, 2025

జూబ్లీహిల్స్‌ బైపోల్.. KCR పిలుపు

image

జూబ్లీహిల్స్ బైపోల్‌పై మాజీ CM KCR మొదటి సారి మాట్లాడారు. కాంగ్రెస్ దుష్ట పాలనపై ప్రజలకు BRS నేతలు, కార్యకర్తలు వివరించి, అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్‌ను నిలబెట్టి HYD ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందన్నారు. రౌడీషీటర్‌ను ఓడించి, HYDలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ దోపిడీ పాలనతో తెలంగాణను గుల్లా చేసిందన్నారు.

News October 23, 2025

నిర్మాణ పనులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం తన ఛాంబర్‌లో హౌసింగ్, మెప్మా, మున్సిపల్ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. గడువులోగా హౌస్ సైట్ మార్కౌట్ పనులు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు అవగాహన కల్పించి, ఇళ్లు త్వరితగతిన నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 23, 2025

భీమడోలులో మహిళా దొంగ అరెస్ట్

image

బస్టాండుల్లో ప్రయాణికుల బ్యాగులను దొంగిలిస్తున్న మహిళను గురువారం భీమడోలు సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశామన్నారు. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడికి చెందిన వేములపల్లి దుర్గ ప్రయాణికులను టార్గెట్ చేసి వారి బ్యాగులను దొంగిలిస్తుంది. నేడు నమోదైన ఓ కేసులో ఆమె నుంచి 33.5 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.