News March 14, 2025

రాజమండ్రి: శక్తి యాప్‌ను ప్రతి మహిళ రిజిస్టర్ చేసుకోవాలి: ఎస్పీ

image

ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్‌ను ప్రతి మహిళ నిక్షిప్తం చేసుకొని ఆపద సమయంలో పోలీసులు నుంచి సహాయం పొందాలని జిల్లా ఎస్పీ టి.నరసింహ కిషోర్ తెలిపారు. శక్తి యాప్ డౌన్లోడ్, ఇన్స్టాలేషన్, ఫీచర్లపై జిల్లా టెక్నికల్ టీంతో ఆయన గురువారం సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలపై జరిగే అత్యాచారాలు, వేధింపులు, ఈవ్ టీజింగ్ వంటి వాటిని నివారించడానికి శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 

Similar News

News March 21, 2025

రాజమండ్రిలో అధికారుల మెరుపు దాడులు

image

తూర్పుగోదావరి జిల్లాలో ఈగల్ టీం శుక్రవారం మెరుపు దాడులు చేసింది. పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసింది. రాష్ట్రంలోని యువత మత్తు పదార్థాలను ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నట్లు సమాచారం ఉండటంతో దాడులు నిర్వహించామని విజిలెన్స్ అధికారి ఎం.స్నేహిత, డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. రాజమండ్రి గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ మెడికల్ ఏజెన్సీలో ట్రెమడల్ మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు.

News March 21, 2025

తూ.గో జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

image

తూ.గో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా రాజమండ్రిలో 36 డిగ్రీలు, గోపాలపురం 32 డిగ్రీలు, కొవ్వూరు 36 డిగ్రీలు నమోదైంది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

News March 21, 2025

రైలు నుంచి జారిపడి బిక్కవోలు వాసి మృతి

image

భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గురువారం జారిపడి మృతి చెందాడని రైల్వే ఎస్ఐ సైమన్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా బిక్కవోలుకు చెందిన అంబటి సుబ్బా రెడ్డి (69) సింహాద్రి రైల్లో రాజమండ్రి వైపు వెళుతున్న సమయంలో జారిపడి మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

error: Content is protected !!