News April 12, 2025
రాజమండ్రి సెంట్రల్ జైలుకు గోరంట్ల మాధవ్

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడి చేసిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. మాధవ్తో పాటు మరో ఆరుగురిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మాధవ్ అతనిపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే.
Similar News
News October 30, 2025
ఇల్లందులో అత్యధిక.. భద్రాచలంలో అత్యల్ప వర్షపాతం

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో.. ఇల్లందు 53.9, జూలూరుపాడు 43.3, చుంచుపల్లి 38.3, ఆళ్లపల్లి 33.5, సుజాతనగర్ 30.3, గుండాల 28.5, లక్ష్మీదేవిపల్లి 27.8, టేకులపల్లి 27.8, కొత్తగూడెం 27.3, చండ్రుగొండ 24, ములకలపల్లి 18.3, కరకగూడెం 17.5, అశ్వారావుపేట 14.5, దుమ్ముగూడెం 10.3, అశ్వాపురం 9.5, దమ్మపేట 8.9, మణుగూరు 7.8, బూర్గంపాడు 6, చర్ల 5.5, పినపాక 5, భద్రాచలం 4.7మీ.మీ.ల వర్షపాతం నమోదైంది.
News October 30, 2025
కోల్కత్తాలో తప్పించుకున్నా శంషాబాద్లో దొరికాడు

విశాల్ అనే వ్యక్తి కోల్కత్తా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్ వచ్చాడు. ఆ తర్వాత అతడు మరో విమానంలో బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అతడి లగేజీని భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా బుల్లెట్ (38MM లైవ్ బుల్లెట్ ) బయటపడింది. దాని గురించి వివరాలు అడగ్గా సరైన సమాధానం లేదు. దీంతో ఆర్జీఐఏ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
News October 30, 2025
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సెలవులు రద్దు

ఖమ్మం జిల్లాలో వర్ష ప్రభావం తగిన నేపథ్యంలో (రేపు) శుక్రవారం తిరిగి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రారంభమవుతుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని తుఫాను ప్రభావం తగ్గి వాతావరణం పొడిగా ఉన్నందున మార్కెట్ను తిరిగి రేపు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కావున రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.


