News March 9, 2025

రాజమండ్రి: సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

image

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఇకపై ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటన విడుదల చశారు. ఈ మేరకు గతంలో మాదిరిగానే ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలియచేశారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఈ పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News March 24, 2025

పెరవల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

తూర్పుగోదావరి జిల్లాలోని జాతీయ రహదారి పై పెరవలి మండలం అన్నవరపాడు సెంటర్లో సోమవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాద ఘటనలో పిట్టల వేమవరం గ్రామానికి చెందిన మాకా సురేశ్ మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోర్ట్ మార్టమ్ నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 24, 2025

రాజమండ్రి: 27న ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు

image

జిల్లాలో వివిధ కారణాలు వల్ల ఖాళీగా ఉన్న 12 ఉపసర్పంచ్ పదవులకు ఈనెల 27న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీపీవో శాంతామణి అన్నారు. రాజమండ్రి డివిజన్‌లో మల్లవరం, పాతతుంగపాడు, లక్ష్మినరసాపురం, మర్రిపూడి, మురమండ, మునికుడలి, కొవ్వూరు డివిజన్‌లో పెనకనమెట్ట, కొవ్వూరుపాడు, గోపాలపురం, వెంకటాయపాలెం, తాడిపూడి, ఉంద్రాజవరం పంచాయతీల ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. EOPR&RD ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు.

News March 24, 2025

రాజమండ్రి: మర్డర్ కేసులో పట్టుబడ్డ నిందితుడు

image

రాజమండ్రి రూరల్ హుకుంపేట డీ బ్లాక్‌లో ఆదివారం తల్లీ కుమార్తెలు ఎండీ సల్మాన్, ఎండీ సానియా మర్డర్ కేసులో నిందితుడు పల్లి శివకుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా నిందితుడు ముళ్ల కంచెలలో నుంచి పరారవుతున్న సమయంలో కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి వెంబడించారు. నిందితుడి నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ధైర్యసాహసాలతో ఎస్సై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

error: Content is protected !!