News March 26, 2025

రాజమండ్రి: సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు

image

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు శాసనమండలి సభ్యునిగా ప్రమాణస్వీకార కార్యక్రమంలో తేదీ మార్పు జరిగినట్లు బుధవారం రాజమండ్రిలో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. గతంలో తెలిపిన విధంగా ఏప్రిల్ 3వ తేదీకి బదులుగా 2వ తేదీకి మార్చినట్లు వెల్లడించారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలని కోరారు. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 10 గంటలకి అమరావతిలో శాసనమండలి వద్ద ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు.

Similar News

News April 23, 2025

రాజమండ్రిలో 25న మెగా జాబ్ మేళా

image

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మురళి తెలిపారు. APSSDC & ప్రభుత్వం కళశాల (A) రాజమండ్రి సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉ.9:30 గంటలకు ప్రారంభమవుతుందని, సుమారు 30కు పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటున్నాయని,యువత సద్వినియోగం చేసుకొవాలన్నారు.

News April 23, 2025

10th RESULTS: 6వ స్థానంలో తూర్పు గోదావరి

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 23,388 మంది పరీక్ష రాయగా 20,578 మంది పాసయ్యారు. 11,975 మంది బాలురులో 10,310 మంది, 11,413 మంది బాలికలు పరీక్ష రాయగా 10,268 మంది పాసయ్యారు. 87.99% పాస్ పర్సంటైల్‌తో తూర్పు గోదావరి 6వ స్థానంలో నిలిచింది.

News April 23, 2025

రాజమండ్రి: స్పా ముసుగులో వ్యభిచారం

image

రాజమండ్రిలో స్పాముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పా‌ సెంటర్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. SI ఆదినారాయణ వివరాల ప్రకారం.. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని చెప్పి యువతులకు ఎరవేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. SIకు వచ్చిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఐదుగురు యువతులు, ఐదుగురు విటులు పట్టుబడ్డారు. స్పా నిర్వాహకుడు మదన్, మేనేజర్ తేజశ్రీని అరెస్టు చేసి కేసు దార్యప్తు చేస్తున్నారు.

error: Content is protected !!