News April 13, 2025
రాజమండ్రి: స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను అభినందించిన డీఐజీ

ప్రవీణ్ కుమార్ పగడాల కేసు ఛేదించేందుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించడంలో ఎంతో ప్రతిభ చాటిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని DIG అశోక్ కుమార్ అభినందించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం అనంతరం SIT టీంను డీఐజీ, ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేకంగా సన్మానించారు. సుమారు 400కుపైగా సీసీ కెమెరాలను పరిశీలించి కేసును కొలిక్కి తేవడంలో SIT అద్భుత ప్రతిభ చాటిందని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు.
Similar News
News January 25, 2026
కొత్త డయాలసిస్ కేంద్రాల జాబితాలో ‘కొవ్వూరు’కు చోటు

శనివారం మంత్రి సత్య కుమార్ ప్రకటించిన ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద కొత్తగా మంజూరైన 5 డయాలసిస్ కేంద్రాల జాబితాలో కొవ్వూరుకు చోటు దక్కింది. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు కొవ్వూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.85 లక్షలతో యంత్రాలు, పరికరాలు ఏర్పాటు చేస్తామని, గ్రామీణ కిడ్నీ బాధితులకు సాంత్వన చేకూర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
News January 25, 2026
విశాఖ ఉత్సవంలో హెలీకాప్టర్ రైడ్

విశాఖ ఉత్సవ్లో భాగంగా రుషికొండ బీచ్ వద్ద పర్యాటకులకు హెలీకాప్టర్ రైడ్ మంచి అనుభూతిని అందింస్తుంది. ఈ హెలీకాప్టర్ను మంత్రి కందుల దుర్గేష్ శనివారం ప్రారంభించారు. ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, MLA శ్రీనివాసరావు, APTDC ఛైర్మన్ బాలాజీ, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్తో కలిసి సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం సముద్రతీరాలు, కొండలు, ఆకాశ మార్గం నుంచి హెలికాప్టర్ రైడ్లో వీక్షించారు.
News January 25, 2026
తూ.గో: నేడు ఆనం కేంద్రంలో ఓటరు దినోత్సవ వేడుకలు

జాతీయ ఎన్నికల కమిషన్ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని నేడు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై.మేఘా స్వరూప్ శనివారం తెలిపారు. ఈ కార్యక్రమం వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు ఓటరు అవగాహన కార్యక్రమాలు, కొత్తగా నమోదు అయిన ఓటర్లకు అభినందనలు, ప్రజాస్వామ్య విలువలపై సందేశాలు ఇస్తారని వెల్లడించారు.


