News May 24, 2024

రాజమండ్రి: హోర్డింగ్‌కు ఉరి వేసుకుని వ్యక్తి మృతి

image

రాజమండ్రిలోని బర్మాకాలనీకి చెందిన జొన్నపల్లి వీరబాబు(24) కుటుంబ కలహాల నేపథ్యంలో క్వారీ మార్కెట్ ప్రాంతంలో హోర్డింగుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సెంట్రింగ్ మేస్త్రి వద్ద కూలి పనులు చేసుకునే అతను ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో తగాదాల నేపథ్యంలో మద్యానికి బానిస అయ్యాడని త్రీ టౌన్ సీఐ వీరయ్య గౌడ్ తెలిపారు. రెండంతస్తుల భవనంపై ఉన్న హోర్డింగుకు ఉరివేసుకొని మృతి చెందాడన్నారు.

Similar News

News November 25, 2025

తూ.గోలోకి కాదు.. కొత్త జిల్లానే!

image

వైసీపీ ప్రభుత్వంలో తూ.గో, కాకినాడ, కోనసీమ, అల్లూరి జిల్లాలుగా ఏర్పాటైన విషయం తెలిసిందే. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు జిల్లా కేంద్రం పాడేరుకు దూరంగా ఉన్నాయి. దీంతో రంపచోడవరం తిరిగి తూ.గోలో కలిపితే జనాభా 10లక్షలు దాటుతుందని అంచనా. ఇదే జరిగితే మరోసారి తూ.గోజిల్లా పెదద్ది అవుతుంది. అలా కాకుండా చింతూరు, రంపచోడవరం డివిజన్లు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై నేడు సీఎం చర్చిస్తారని సమాచారం.

News November 25, 2025

తూ.గోలోకి కాదు.. కొత్త జిల్లానే!

image

వైసీపీ ప్రభుత్వంలో తూ.గో, కాకినాడ, కోనసీమ, అల్లూరి జిల్లాలుగా ఏర్పాటైన విషయం తెలిసిందే. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు జిల్లా కేంద్రం పాడేరుకు దూరంగా ఉన్నాయి. దీంతో రంపచోడవరం తిరిగి తూ.గోలో కలిపితే జనాభా 10లక్షలు దాటుతుందని అంచనా. ఇదే జరిగితే మరోసారి తూ.గోజిల్లా పెదద్ది అవుతుంది. అలా కాకుండా చింతూరు, రంపచోడవరం డివిజన్లు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై నేడు సీఎం చర్చిస్తారని సమాచారం.

News November 25, 2025

నిడదవోలు రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

image

నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ సోమవారం ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన నిడదవోలు మున్సిపాలిటీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గణపతి సెంటర్‌లో జరిగే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారని మంత్రి వెల్లడించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.