News March 12, 2025
రాజమండ్రి: 2029 నాటికి ‘అందరికీ ఇల్లు’

స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి ‘అందరికీ ఇల్లు’ కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 27,441 మందికి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అలాగే అసంపూర్తి ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం కింద ఎస్సీ, బిసీలకు రూ.50,000/- & ఎస్టీలకు రూ.75,000 అందజేయనున్నట్లు వెల్లడించారు.
Similar News
News March 9, 2026
కలెక్టరేట్లో యథాతథంగా ‘పీజీఆర్ఎస్’: కలెక్టర్

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్లను యథాతథంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.in ఆన్లైన్లోనూ నమోదు చేసుకోవచ్చని, వివరాల కోసం 1100 నంబరును సంప్రదించాలని సూచించారు. అధికారులు విధిగా హాజరై అర్జీలను స్వీకరించాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News March 8, 2026
తూ.గో: రోడ్డు ప్రమాదంలో మహిళ స్పాట్డెడ్

చాగల్లు ప్రధాన కూడలిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలయ్యారు. కుమారదేవానికి చెందిన పంది వీర్రాజు, నాగలక్ష్మి(52) దంపతులు శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎదురుగా వచ్చిన లారీ వారి మోటారు సైకిల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 7, 2026
తూ.గో: స్టూడెంట్స్తో మీనాక్షి చౌదరి డాన్స్

గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ లో జరుగుతున్న మైత్రి యువజనోత్సవాలలో శుక్రవారం రాత్రి నటి మీనాక్షి చౌదరి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి పాటలు పాడి డాన్స్ చేశారు. తాను దంతవైద్యం చదివి నటినయ్యానని.. విద్యార్థుల ఆనందం చూస్తుంటే తన చదువుకునే రోజులు గుర్తొస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం మీనాక్షిని చాన్స్లర్ చైతన్య రాజు సత్కరించారు. భవిష్యత్తులో మీలోనే ఎందరో నటీనటులు రావచ్చని ఆమె ఆకాంక్షించారు.


