News August 3, 2024

రాజమండ్రి: YCP కార్యాలయం కూల్చివేత ఉత్తర్వులు రద్దు

image

రాజమండ్రిలో YCP భవనం కూల్చివేతకు మున్సిపల్ కమిషనర్ జులై 22న ఉత్తర్వులిచ్చారు. దీనిని సవాల్ చేస్తూ YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి, YCP జిల్లాధ్యక్షుడు జక్కంపూడి రాజా హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. మున్సిపాలిటీ నుంచి అనుమతి కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. ఆ దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది.

Similar News

News December 17, 2025

తూ.గో: సంక్రాంతి కి స్పెషల్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్..

image

సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా మీదుగా పలు స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డు మధ్య 07288/ 07289 నంబర్ రైళ్లు జనవరి 9,10,11,12 తేదీలలో రాకపోకలు ఉంటాయి. 07290/07291 నంబర్ రైళ్లు సికింద్రాబాద్ -శ్రీకాకుళం రోడ్డు మధ్య 10, 11, 12, 13, 16, 17, 18, 19 తేదీల్లోనూ, శ్రీకాకుళం రోడ్డు సికింద్రాబాద్‌కు 07295 రైలు జనవరి 14న ట్రైన్స్ నడవనున్నాయి.

News December 17, 2025

తూ.గో: ‘జిల్లాలో ధాన్యం సేకరణ విజయవంతం’

image

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్‌లో ధాన్యం సేకరణ విజయవంతంగా కొనసాగుతోందని జేసీ వై. మేఘ స్వరూప్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా డిసెంబర్ 16, 2025 నాటికి జిల్లాలో 42,977 మంది రైతుల నుంచి రూ. 770.74 కోట్ల విలువ చేసే 3,25,345 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటివరకు 37,308 మంది రైతులకు రూ. 659.76 కోట్లను చెల్లించినట్లు ఆయన వివరించారు.

News December 17, 2025

తూ.గో: ‘జిల్లాలో ధాన్యం సేకరణ విజయవంతం’

image

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్‌లో ధాన్యం సేకరణ విజయవంతంగా కొనసాగుతోందని జేసీ వై. మేఘ స్వరూప్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా డిసెంబర్ 16, 2025 నాటికి జిల్లాలో 42,977 మంది రైతుల నుంచి రూ. 770.74 కోట్ల విలువ చేసే 3,25,345 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటివరకు 37,308 మంది రైతులకు రూ. 659.76 కోట్లను చెల్లించినట్లు ఆయన వివరించారు.