News November 13, 2024

రాజమహేంద్రవరం-అనకాపల్లి హైవే విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఎంపీ

image

రాజమహేంద్రవరం-అనకాపల్లి జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. జాతీయ రహదారి-16 పరిధిలోని అనకాపల్లి- అన్నవరం-దివాన్ చెరువు సెక్షన్లలోని నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరించడానికి డీపీఆర్‌లను కేంద్రం సంబంధిత కన్సల్టెంట్‌కు అందజేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 25, 2026

ఏపీ మెడిటెక్ జోన్‌లో ఇండో-జర్మన్ టెక్నాలజీ సెంటర్?

image

విశాఖలోని A.P మెడిటెక్ జోన్‌లో ఇండో-జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. జర్మన్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం పర్యాటనలో ఈ ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. మెడ్‌టెక్ రంగంలో సంయుక్త పరిశోధన, ఆధునిక సాంకేతిక అభివృద్ధికి ఇది కీలకం కానుంది. ఇదే రోజున రోబోటిక్స్ సంస్థ Cogmac Technologies మెడిటెక్ జోన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

News February 25, 2026

రాజాంలో పద్మం సిల్వర్ జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్

image

పద్మం సిల్వర్ జువెలరీ బ్రాంచ్‌ను రాజాంలోని పాలకొండ రోడ్డులో గల CMRలో ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌ను టీడీపీ నాయకుడు కొండ్రు జగదీశ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్‌లో విభిన్న ఆభరణాలతో పాటు అద్భుతమైన ఆఫర్లను పెట్టారు. సిల్వర్ జువెలరీకి కూడా మార్కెంట్‌లో డిమాండ్ పెరిగిందని CMR గ్రూపుల అధినేత మావూరి వెంకట రమణ పేర్కొన్నారు.

News February 25, 2026

విశాఖలో పర్యటించనున్న ఒడిశా గవర్నర్

image

ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఐఐఏఎమ్‌లో పుస్తకావిష్కరణ, ‘ప్రైడ్ ఆఫ్ నేషన్’ అవార్డుల ప్రదానం, బాలాజీ హైఫీల్డ్స్ స్కూల్ వార్షికోత్సవం, అమలాపురంలో జరిగే ‘వరల్డ్ తెలుగు కాన్‌క్లేవ్’ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మార్చి 5న తిరిగి భువనేశ్వర్ వెళ్తారు.