News January 22, 2025
రాజమహేంద్రవరం: పెళ్లి పేరుతో మోసం.. అధ్యాపకుడిపై కేసు

పెళ్లి చేసుకుంటానని యువతిని మోసగించిన ఆత్రేయపురం మండలం వెలిచేరుకు చెందిన అధ్యాపకుడు సురేశ్ కుమార్పై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ రాము మంగళవారం తెలిపారు. రాజమహేంద్రవరం కొంతమూరుకు చెందిన యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామన్నారు. పెళ్లి పేరు చెప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి తనకు ఇంతకుముందే పెళ్లయిందని సమాధానం చెబుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు.
Similar News
News December 7, 2025
రాజమండ్రిలో నేటి చికెన్ ధరలు ఇలా

రాజమండ్రి మార్కెట్లో ఆదివారం చికెన్, మటన్కు డిమాండ్ భారీగా పెరిగింది. స్కిన్ లెస్ చికెన్ ధర కేజీ రూ.250గా ఉండగా, స్కిన్ చికెన్ రూ.230కి విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ.140-150 మధ్య లభిస్తోంది. ఇక, మటన్ ధర కేజీకి రూ.900గా ఉంది. ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు నమోదవుతున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News December 7, 2025
కొవ్వూరు బీజేపీలో ఆధిపత్య పోరు

కొవ్వూరు BJPలో ఆధిపత్య పోరు ఉందని ప్రచారం సాగుతోంది. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పరిమి రాధాకృష్ణ మధ్య సఖ్యత లోపించిందని క్యాడర్ గుసగుసలాడుతోంది. తాజాగా కొవ్వూరు రైల్వే స్టేషన్లో రెండు హాల్టుల పునరుద్ధరణపై ఇరువురు నేతలు తమ మద్దతుదారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. క్రమశిక్షణకు మారుపేరైన BJPలో ఇలాంటి పరిస్థితి ఏంటని కార్యకర్తలు వాపోతున్నారు.
News December 7, 2025
నేర నియంత్రణకు కఠిన చర్యలు: ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా జిల్లాలో 317 మందిపై రౌడీషీట్లు తెరిచినట్లు ప్రకటించారు. 19 మందిపై పీడీ యాక్ట్, పలువురిపై పీఈటీ ఎన్ఏఎస్ నమోదు చేశామని, 432 మందిపై బైండోవర్ కేసులు పెట్టామని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అవసరమన్నారు.


