News December 11, 2024
రాజముద్రలతో నూతన పాస్ పుస్తకాలు: మంత్రి ఆనం
జగన్ బొమ్మలు తొలగించి రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలతో రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని పొంగూరు, నాగులపాడు రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..పాస్ పుస్తకలపై జగన్ ఫోటోను తొలగించి రాజముద్రలతో ముద్రితమవుతాయని, భూ సమస్యలను పరిష్కరించి, రైతులకు పూర్తి హక్కులు కల్పించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని తెలిపారు.
Similar News
News January 25, 2025
కావలి వెంకటేశ్వర థియేటర్కు నోటీసులు జారీ
కావలి పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్కు RDO వంశీకృష్ణ నోటీసులు జారీచేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రానికి ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కానీ థియేటర్ యాజమాన్యం 24వ తేదీ కూడా అధిక రేట్లకు విక్రయించడంతో కావలికి చెందిన వెంకటేశ్వరరావుతోపాటు మరికొంతమంది ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం దీనిపై వివరణ ఇవ్వాలని RDO ఆదేశించారు.
News January 25, 2025
విద్యార్థులకు బహుమతులు అందజేసిన నగర కమిషనర్
జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన 117 నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు మోడల్ స్కూల్ ప్రాంగణంలో క్విజ్, ఎస్సే రైటింగ్ , వక్తృత్వ పోటీలను నిర్వహించారు. అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కమిషనర్ విద్యార్దులను అభినందించారు. అనంతరం బహుమతులను అందజేశారు.
News January 24, 2025
ఉదయగిరి: హైస్కూల్ సమీపంలో కొండచిలువ హల్చల్
ఉదయగిరి మండలం బిజంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. కొండ చిలువ వరి కోత మిషన్లో ఇరుక్కుని పోయి ఉండగా రైతులు గమనించి చంపేశారు. సమీపంలోనే పాఠశాల ఉండడం విద్యార్థులు తరచుగా అటు ఇటు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.