News March 18, 2025
రాజవొమ్మంగిలో యువతి ఆత్మహత్య

రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ కాలనీకి చెందిన ఆర్.సంజనా ప్రియ (19) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని సీఐ సన్యాసినాయుడు సోమవారం రాత్రి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు వంట చేయకుండా టీవీ చూస్తున్న యువతిని మందలించారు. అనంతరం యువతి క్షణికావేశంలో గడ్డిమందును తాగింది. కాకినాడ జీజీహెచ్కి తరలించి చికిత్స అందజేస్తుండగా మృతి చెందిందని సీఐ చెప్పారు.
Similar News
News September 15, 2025
BREAKING: కాలేజీలతో చర్చలు సఫలం

TG: కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. ప్రస్తుతం రూ.600కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ను విరమించుకున్నాయి.
News September 15, 2025
ఆసిఫాబాద్: వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

ఆసిఫాబాద్ మండలం, బనార్వాడకు చెందిన చిచోల్కార్ సుధాకర్ (66) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఈనెల 2న తన టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరిన సుధాకర్, సాయంత్రమైనా తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 15, 2025
వరంగల్: ప్రజాపాలన వేడుకలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

జిల్లా కేంద్రంలో ఈనెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన వేడుకలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. అజాం జాహి గ్రౌండ్స్లో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్(ఐడీవోసీ)వద్ద నిర్వహించనున్న ఈ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో, జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయి, డీసీపీ అంకిత్ కుమార్, సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు.