News March 18, 2025
రాజవొమ్మంగిలో యువతి ఆత్మహత్య

రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ కాలనీకి చెందిన ఆర్.సంజనా ప్రియ (19) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని సీఐ సన్యాసినాయుడు సోమవారం రాత్రి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు వంట చేయకుండా టీవీ చూస్తున్న యువతిని మందలించారు. అనంతరం యువతి క్షణికావేశంలో గడ్డిమందును తాగింది. కాకినాడ జీజీహెచ్కి తరలించి చికిత్స అందజేస్తుండగా మృతి చెందిందని సీఐ చెప్పారు.
Similar News
News February 23, 2026
NZB: 30 ఫిర్యాదులను స్వీకరించిన సీపీ

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 30 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని CP చెప్పారు.
News February 23, 2026
ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి మార్చ్ 3, 5, 6 తేదీల్లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. టీజీటీ హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, సాంఘిక శాస్త్రం, గణితం, సైన్స్, కంప్యూటర్ బోధకుడు, సంగీతం/నృత్య బోధకుడు, కౌన్సిలర్, ప్రత్యేక ఉపాధ్యాయుడు, PRT, Sports బోధకుడు, తెలుగు భాషా ఉపాధ్యాయుడు స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయన్నారు.
News February 23, 2026
RR: ఉగ్గుపాల నుంచే ఒగ్గు కథల వైపు మల్లారి!

ఒగ్గు కథ చెప్పడం మగాళ్లకే పరిమితమైన రోజుల్లో ఓ మహిళ కథ చెప్పడానికి బయలుదేరింది. రంగారెడ్డి(D),యాచారం(M), నక్కర్త మేడిపల్లికి చెందిన జమ్మ మల్లారి. ఈమె వేలకొద్దీ బీరప్ప కళ్యాణాలు చేసి, ఒగ్గు కథలు వినిపించి ఒగ్గుకథ ‘సూపర్స్టార్’గా ఎదిగారు. జీవితాన్ని ఒగ్గుకథకు అంకితం చేసి తొలి మహిళా ఒగ్గు కథా కళాకారిణిగా పేరుగాంచి 2020లో విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకుని FEB 7న ఆమె శివైక్యం చెందారు.


